మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్స్‌పరిమెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు. తన మొదటి సినిమా నుండి ఈ విషయాన్ని గమనించవచ్చు కూడా. కంచె, అంతరిక్షం లాంటి సినిమాలు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా కూడా చెప్పొచ్చు. ఇక ఈ మెగా హీరో రీసెంట్ గా 'వాల్మీకి' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. సినిమా కలెక్షన్స్ యావరేజ్ అయినప్పటికీ వరుణ్ తన మేకోవర్ తో మాస్ యాక్టింగ్ తో అందరినీ చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. అయితే 'వాల్మీకి' సినిమా తర్వాత వరుణ్ చేయబోయో నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఒక ఆసక్తి నెలకొంది. ఇక తాజా సమాచారం ప్రకారం వరుణ్ ఒక స్పోర్ట్స్ డ్రామా బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కనున్న సినిమాలో చేసేందుకు రెడీ అవుతున్నాడని లేటెస్ట్ న్యూస్.

వాస్తవంగా వరుణ్ గత ఏడాది నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఇదే సినిమాలో నటించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాకోసం వరుణ్ రెండు నెలల పాటు అమెరికాలో బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అయితే అదే సమయంలో హరీష్ శంకర్ 'వాల్మీకి' తో ముందుకు రావడంతో ఈ స్పోర్ట్స్ డ్రామా ను పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమానే పట్టాలెక్కిస్తున్నారని తాజా సమాచారం. ఈ సినిమాతోనే అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ నిర్మాతగా మారతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద కాకుండా తనకంటూ సొంత బ్యానర్ పై ఈ సినిమాను అల్లు బాబీ నిర్మిస్తారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను అక్టోబర్ 10 న లాంచ్ చేస్తున్నారట. ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కాబట్టి ఎక్కువ రిస్క్ లేకుండా లిమిటెడ్ బడ్జెట్లో పూర్తి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారట దర్శక నిర్మాతలు. దీన్ని బట్టి చూస్తే 'వాల్మీకి' తర్వాత మెగా ప్రిన్స్ మరో ప్రయోగానికి సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. ఒకరకంగా చూస్తే ఇలాంటి హీరో మన టాలీవుడ్ కి ఎంతో అవసరం. అందరిలా ఒక మూసధోరణిలో కాకుండా ప్రయోగాత్మకంగా కథలను సెలెక్ట్ చేసుకుని తన స్టామినాని ప్రూవ్ చేసుకుంటున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: