తెలుగు లో వరుస విజయాలు అందుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు.  టాలీవుడ్ లో కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా అనీల్ రావిపూడి వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  రవితేజతో రాజా ది గ్రేట్ సినిమాతో తర్వాత ఈ సంవత్సరం వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘ఎఫ్ 2’ లాంటి కామెడీ ఎంట్రటైన్ మెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  

ఇక కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’లాంటి సూపర్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ఈ సంతవ్సరం వంశి పైడిపల్లి దర్శకత్వలో వచ్చిన ‘మహర్షి’తో మరో ఘన విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.  తాజాగా అనీల్ రావడిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ లో నటిస్తున్నాడు. టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న వారికి రెమ్యూనరేషన్ బీభత్సంగా ఉంటుందని తెలిసిందే. కానీ ఈ మూవీకి మహేష్ బాబు ఒక్క పైసా కూడా తీసుకోలేదని నిర్మాత అనీల్ సుంకర తెలిపారు.

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కి అనీల్ సుంకరతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజుకి, అనీల్ సుంకరకి మధ్య కూడా విభేదాలు వచ్చాయని వదంతులు వినిపించాయి. అయితే ఈ మూవీకి ఆయన వాటా ఇవ్వబోతున్నామని చెప్పారు. ఈ విషయంపై అనీల్ సుంకర క్లారిటీ ఇచ్చారు.


దిల్ రాజు తనతో చాలా సన్నిహితంగా ఉంటారని.. సినిమా ప్రొడక్షన్ లో ఆయన భాగం తీసుకోవడం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పారు. ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: