బిగ్ బాస్ చివరి అంకానికి వచ్చేసింది. ఫైనల్ చేరడానికి ఇంకా మూడు వారాలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో ఫైనల్ వరకు నిలిచే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ మొదలైంది.  మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లలో ఐదుగురు మాత్రమే ఫైనల్ చేరుకుంటారు. ఆ ఐదుగురు ఎవరనేది చూస్తే, మొదటగ శ్రీముఖి మొదటి నుండి చాలా తెలివిగా ఆడుతూ,అవసరమొచ్చినపుడల్లా గేమ్ ప్లాన్ మారుస్తూ ఉంది. అంతేగాక ఆమెకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే ఉంది.


ఇక బాబా భాస్కర్ నాగార్జున సీరియస్ గా ఆడమని చెప్పినప్పటి నుండి ఇంకా పట్టుదలగా ఆడుతున్నాడు. ఇంతకు ముందు ప్రతీసారి వెళ్ళిపోతానని చెప్పే బాబా నోటి నుండి ఈ మధ్య ఆ మాటలు రావట్లేదు. కాబట్టి బాబా భాస్కర్ కూడా ఫైనల్ చేరుకుంటాడని నమ్ముతున్నారు. ఇక మహేష్, ఇక్కడి విషయాలు అక్కడ చెప్తూ డబల్ గేమ్ ఆడడం వల్ల ప్రేక్షకుల్లో అతని పట్ల వ్యతిరేకత పెరిగింది.


ఈ వారం నామినేషన్ లో ఉన్న కారణంగా అతను ఇంటి నుండి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇక శివజ్యోతి, వితికా లు గేమ్ బాగానే ఆడుతున్నప్పటికీ వారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ లేదు. కాకపోతే వితికా కంటే శివజ్యోతికే ఫైనల్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఆలీ  రీ ఎంట్రీ ఇచ్చాక అతనిలో మునుపటి జోష్ తగ్గింది. దానివల్ల అతనికి ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. నామినేషన్ లోకి వస్తే తప్పకుండా ఎలిమినేట్ అవుతాడు.


ఇక మిగిలిన వారిలో రాహుల్ కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. నామినేషన్ లో ఉన్న ప్రతీసారి సేవ్ అవుతున్నాడంటే అతనికి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుణ్ కి మొదటి నుండి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఒక దశలో టైటిల్ విన్నర్ వరుణ్ అంటూ వార్తలు వచ్చాయి. మొత్తానికి చివరి వరకు నిలిచే ఐదుగురు శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి, రాహుల్, వరుణ్ లు అని అని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: