స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ భాగస్వామ్యంలో నిర్మించబడుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

 

2020 సంక్రాంతి బరిలో ఈ సినిమా దిగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో బన్నీ ఇంకా ఓకే చెప్పలేదట. 

 

ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ బన్నీ కొన్ని మార్పులు చెప్పాడట.  అందుకే సినిమా ముహూర్తం లేట్ అవుతుందని అంటున్నారు. అసలైతే దసరాకి ఈ సినిమా ఓపెనింగ్ ఉండాల్సింది కానీ ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ అవలేదు కాబట్టే బన్నీ సినిమా ఇంకా హోల్డ్ లోనే పెట్టాడట. మహర్షి తర్వాత మహేష్ తో సుకుమార్ సినిమా చేయాల్సింది. కానీ మహేష్ కూడా కథలో మార్పులు చెప్పాడని అతన్ని కాదని అల్లు అర్జున్ దగ్గరకు వచ్చాడు. 

 

ఇక ఇప్పుడు బన్నీ కూడా సుకుమార్ కథకు మార్పులు చెబుతున్నాడట.  బన్నీని కాదని బయటకు వెళ్లలేని పరిస్థితి అందుకే సుకుమార్ సైలెంట్ గా స్క్రిప్ట్ పని చేస్తున్నాడట. మరి బన్నీని మెప్పించే సెకండ్ హాఫ్ తో వస్తే తప్ప సుకుమార్ సినిమా ఉండేలా లేదు. రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ పరిస్థితి మాత్రం మారలేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: