ఇండస్ట్రీలో అల్లు అరవింద్ లెజెండ్ ప్రొడ్యూసర్ అన్న విషయం తెలిసిందే. ఒక కథ గనక ఆయనకు నచ్చి పెట్టిన పెట్టుబడి కి నాలుగింతలు వస్తుందనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా బడ్జెట్ కాస్త ఎక్కువైనా నిర్మించడానికి ముందుకు వస్తారు. అందులో మెగాస్టార్ హీరోగా అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు ఇటువంటి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' విడుదలై ఇప్పటికి వారం రోజులయింది. ఇక కలెక్షన్స్ గురించి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ లెక్కలే సినిమా అసలు లెక్కలు చెప్తాయన్న సంగతి తెలిసిందే.  'సైరా' దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని ఫిలిం మేకర్స్ చెప్పారు. నాన్ - థియేట్రికల్ రైట్స్ సంగతి పక్కన పెడితే థియేట్రికల్ రైట్స్ భారీ స్థాయిలో అమ్మిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడం కష్టమేనని స్పష్ఠంగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది కానీ బ్రేక్ ఈవెన్ కు ఆ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు. మరోవైపు దసరా సీజన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు.. కర్ణాటక తప్ప మరే ఇతర ప్రాంతంలోనూ ఈ సినిమా కలెక్షన్ అంచనాలను అందుకోలేదు. ఒవరాల్ గా చూస్తే ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ సందర్భంగా సినీవర్గాలలో మరో ఇంట్రెస్టింగ్ టాక్ కూడా వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్న విషయం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందే ఊహించారని అందుకే ఈ సినిమాకు దూరంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ స్టామినాను కరెక్ట్ గా అంచనా వేయగలిగిన వాళ్ళలో అరవింద్ ఒకరు. స్టార్ హీరోలకు ఈ ప్యాన్ ఇండియా సినిమాలు వర్క్ అవుట్ అయ్యే అవకాశం చాలా తక్కువనే సంగతి అరవింద్ కు క్లియర్ గా తెలుసు కాబట్టే ఆయన 'సైరా'కు దూరంగా ఉన్నారని అంటున్నారు. 'సైరా' చిరంజీవికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విషయం అరవింద్ గారికి 12 ఏళ్ళ క్రితమే తెలిసినప్పటికి ఆ సినిమాను చిరు మార్కెట్ కంటే డబల్ బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకు రాకపోవడానికి అసలు కారణం అదేనని ఇన్‌సైడ్ టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: