డాషింగ్ డైరెక్టర్  పూరి జగన్నాథ్  తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. కానీ  ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ,  పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేశాడు.  కాగా  నూతన దర్శకుడు అనిల్ పాదూరి  దర్శకత్వంలో  ఆకాష్ తన రెండో  సినిమా 'రొమాంటిక్' చేస్తోన్న విషయం తెలిసిందే.  కాగా  ఈ సినిమా హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ  షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్  లుక్ పోస్టర్ బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే.  హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం..   ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో  పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది.  మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్  సినిమా పై అంచనాలను పెంచింది. 


ఇక ఈ సినిమా  మాఫియా నేపథ్యంలో  ఓ  ప్రేమ కథగా తెరకెక్కనుందట.   మరి ఈ సినిమాతోనైనా  ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో  బాలీవుడ్ నటి మందిరా  బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. అలాగే  మరో హిందీ నటుడు  మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.  పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్  మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు.  చాలా సినిమాల  తర్వాత హిట్ కొట్టడంతో  పూరి - ఛార్మి మంచి జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం  విజయ్ దేవరకొండతో తమ సినిమా ఉంటుందని పూరి - ఛార్మి కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత పూరి బాలయ్యతో సినిమా  చేయబోతున్నాడు.  


బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం కూడా రీమేక్ అవుతుందట.  బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  హీరో  రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో  నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్  హీరోయిన్లుగా  వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం  బాక్సాఫీస్ వద్ద గుడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. దాంతో  ఈ చిత్రం ఓవర్శిస్ తో పాటు తెలుగు రాష్ట్రాల  అన్ని కేంద్రాల్లో భారీ కలెక్షన్స్  వచ్చాయి.  దాంతో  ఈ చిత్రం  రెట్టింపు లాభాలనుసొంతం చేసుకుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: