చార్మి.. ఒకప్పుడు టాలీవుడ్ లో వెలిగిపోయిన హీరోయిన్.. ఇప్పుడు తాను సినిమాల్లో నటించకపోయినా నిర్మాతగా సినీరంగంలోనే ఉందీ పంజాబీ భామ. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలసి సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమా నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకుంటోంది.


సినీ ఇండస్ట్రీలో చార్మి చాలా స్వేచ్ఛగా ఉండే హీరోయిన్.. మొదట్లో ఆమె కృష్ణవంశీ సినిమాలతో బాగా ఫామ్ లోకి వచ్చింది. డైరెక్టర్ కృష్ణ వంశీ చార్మి అనేక సినిమాలు కలసి చేశారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటారు.ఎంత క్లోజ్ అంటే.. దాదాపు ఒకే అపార్ట్ మెంట్ లో ఉండేవారట.


ఆ సమయంలోనే కృష్ణవంశీ విషయంలో చార్మికీ, రమ్యకృష్ణకూ గొడవైందని సినీ విమర్శకులు ఇమంది రామారావు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత చార్మి కృష్ణవంశీకి దూరమయ్యారని.. ఆయన వివరించారు.


ప్రస్తుతం చార్మి కొన్నేళ్లుగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలసి పని చేస్తున్నారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ్ సైతం.. మహిళలకు బాగా స్వేచ్ఛ ఇస్తాడని.. వారిని ప్రోత్సహిస్తారని ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పారు. జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా చార్మిలోని నటిని పూరి బాగా ఆవిష్కరించారని ఆయన అభిప్రాయపడ్డారు.


ఇటీవలి కాలంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు చార్మి కో ప్రోడ్యూసర్ గా వ్యవహరించారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్, చార్మి జంట ఈ సినిమా హిట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చార్మి కేవలం నటిగానే కాకుండా నిర్మాత చాలా బాగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పూరీ జగన్నాథ్ మెచ్చుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: