2020 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మరో సూపర్ స్టార్
రజనీ కాంత్ 'దర్బార్ సినిమాలతో పోటి పడేందుకు నందమూరి కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సినిమాతో రెడీ అవుతున్నాడు. నందమూరి వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన
కళ్యాణ్ రామ్ హీరోగా స్టార్ ఇమేజ్ అందుకోవటంతో మాత్రం ఇప్పటికీ కాస్త వెనకబడే ఉన్నాడు. తన కెరీర్లో ఒకటి రెండు భారీ హిట్ సినిమాలు ఉన్నా తన తమ్ముడు తారక్ లా భారీ మాస్ ఫాయిలోయింగ్ మాత్రం సాధించుకోలేకపోయాడు. ఇటీవల 118 సినిమాలో ఆకట్టుకున్న
కళ్యాణ్ రామ్, ప్రస్తుతం 'ఎంత మంచివాడవురా' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
శతమానం భవతి తో కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దసరా సందర్భంగా టీజర్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సంక్రాంతి బరిలో దిగుతున్నట్టుగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ సారి సంక్రాంతి బరిలో 3 భారీ చిత్రాలు బరిలో దిగుతున్నాయి. సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అవుతోంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా తో పాటు సూపర్ స్టార్ రజని కాంత్-ఏ.ఆర్ మురగదాస్ కూడా పండగ సీజన్ నే టార్గెట్ చేస్తున్నారు.
ఇప్పుడు అదే సీజన్లో కళ్యాణ్రామ్ సినిమా విడుదల అంటూ ప్రకటించటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. 3 భారీ సినిమా మధ్య
కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ అయితే కలెక్షన్లు ఎలా ఉంటాయో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్లో రెండు మూడు సినిమాలకు అవకాశం ఉన్నా టాప్ హీరోలతో పోటి పడితే నష్టమే ఎక్కువగా ఉంటుందన్న విషయం అదరికి తెలిసిందే. ఎఫ్ 2 లాంటి సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి..
మహేష్ హీరోగా సినిమా తెరకెక్కిస్తుండటంతో సరిలేరు నీకెవ్వరు..బన్నీ, త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో, రజనీ దర్బార్ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూడు భారీ సినిమాలతో పోటి పడుతున్న ఎంతమంచి వాడవురా పండుగ సీజన్ లో అసలు కనిపిస్తుందా..! అని ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు.