ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలలో జాతీయ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయాలనే లక్ష్యంతో విడుదల అయిన ప్రభాస్ ‘సాహో’ చిరంజీవి ‘సైరా’ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాయి. ‘సాహో’ కి ఫ్లాప్ టాక్ వచ్చినా బాలీవుడ్ లో మంచి కలక్షన్స్ రాబట్టింది. ‘సైరా’ కు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినా ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప ఎక్కడా ‘సైరా’ తన ప్రభావాన్ని చూపించ లేకపోయింది. 

ఇలాంటి పరిస్థితులలో ‘సైరా’ ‘సాహో’ టీమ్ లు కలిసి ఒక సినిమాకు పనిచేయబోతున్నాయి అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మధ్యనే ‘సైరా’ ను చూసిన ప్రభాస్ సురేంద్ర రెడ్డి ఈ మూవీ మేకింగ్ లో ప్రదర్శించిన సమర్ధత పై ప్రశంసలు కురిపించడమే కాకండా  తనకు సరిపోయే ఒక మంచి కథ ఉంటే చెప్పమని కోరినట్లు తెలుస్తోంది. 

ఈ అనుకోని ఆఫర్ కు జోష్ లోకి వెళ్ళిపోయిన సురేంద్ర రెడ్డి ప్రస్తుతం తన టీమ్ తో ప్రభాస్ కు సరిపడే కథ గురించి ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ప్రభాస్ ప్రస్తుతం జిల్ రాథాకృష్ణ దర్శకత్వంలో ఒక మూవీలో నటిస్తున్నప్పటికీ ఈ మూవీ తరువాత ఏ దర్శకుడుతో తన తదుపరి సినిమా చేయాలి అన్న విషయమై చాల కన్ఫ్యూజ్ అవుతున్నాడు.  

‘సైరా’ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీని చేస్తే ఇప్పటికే తనకు ఏర్పడిన నేషనల్ స్టార్ ఇమేజ్ ని చాల సులువుగా కొనసాగించవచ్చు అన్నది ప్రభాస్ ప్రాధమిక అభిప్రాయం అని అంటున్నారు. అయితే సురేంద్ర రెడ్డి చెప్పబోయే కథను బట్టి ప్రభాస్ నిర్ణయం ఉంటుంది అని తెలుస్తోంది. వాస్తవానికి సురేంద్ర రెడ్డితో ఒక మూవీ చేయాలని నితిన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ పిలుపు రావడంతో సురేంద్ర రెడ్ది నితిన్ ను విడిచి పెట్టి ప్రభాస్ వైపు వెళతాడా లేదంటే ప్రభాస్ నితిన్ లకు సమాంతరంగా వేరువేరు కథలు చెపుతూ ఎవరో ఒకరిని ఫైనల్ చేసుకుంటాడా అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: