తెలుగులో ప్రస్తుతం సినిమాల హవా బాగా నడుస్తుంది.. దసరా పండుగ ముగియడంతో సినిమాలను తెరకెక్కించడంలో సినీ దర్శక నిర్మాతలు మరింత జోరును పెంచారు. పెద్ద స్టార్ హీరోలైన అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు సంక్రాంతికి బరిలో దిగనున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతుండటం తో ఈ ఇద్దరి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


ఇకపోతే మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా దాదాపు షూటింగ్ పూర్తవడంతో ప్రమోషన్స్ వైపు జోరును పెంచింది. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మొన్న దసరాకి రిలీజ్ అయినా పోస్టర్ జనాల్లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఆ పోస్టర్ ను చుస్తే మరోసారి ఒక్కడు సినిమా చూస్తున్నట్లు ఉందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. 



ఈ సినిమాకి పోటీగా అల్లు అర్జున్ అంటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా రాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి బరిలో దిగుతుంది. దసరాకు ఈ సినిమా నుండి కూడా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ బన్నీ పై ట్రోల్స్ వేస్తున్నారు అదేంటంటే.. ఎన్టీవీ లో మొన్న మధ్య సినిమా సందడి కార్యక్రమంలో యాంకర్ సంక్త్రాంతికి రానున్న సినిమా గురించి చెబుతూ సరిలేరు నీకెవ్వరూ సినిమా గురించి కూడా చెప్పింది. 


ఇందులో ఏముంది అనుకోకండి..బన్నీ సినిమాను కొంచం ఎక్కువ చేసినట్లు ఆమె చెప్పగా దానికి మహేష్ ఫ్యాన్స్ ఆ షో పై ట్రోల్స్ వేశారు. ఎన్టీవీ ఉద్యోగి ఒకతను ఈ సినిమాను నెగిటివ్ గా చెప్పమని చెప్పాడు ఆమె అలా చెప్పిందని చెప్పారు. అతను ప్రస్తుతం గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దానికి స్పందించిన ఆ అయన ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను ఎన్టీవీ లో జాబ్ మానేసి దాదాపుగా ఏడాది దాటింది నేనేందుకు చెబుతాను అని అన్నారు. మారియో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: