తెలుగులో ప్రస్తుతం సినిమాల హవా బాగా నడుస్తుంది.. దసరా పండుగ ముగియడంతో సినిమాలను తెరకెక్కించడంలో సినీ దర్శక నిర్మాతలు మరింత జోరును పెంచారు. పెద్ద స్టార్ హీరోలైన అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు సంక్రాంతికి బరిలో దిగనున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతుండటం తో ఈ ఇద్దరి ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


ఇకపోతే మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా దాదాపు షూటింగ్ పూర్తవడంతో ప్రమోషన్స్ వైపు జోరును పెంచింది. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మొన్న దసరాకి రిలీజ్ అయినా పోస్టర్ జనాల్లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఆ పోస్టర్ ను చుస్తే మరోసారి ఒక్కడు సినిమా చూస్తున్నట్లు ఉందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. 


అసలు విషయానికొస్తే.. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మరో సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమానే ఎంత మంచివాడవురా.. నిన్న ఈ సినిమానుండి టీజర్ రిలీజ్ అయింది.. పల్లెటూరు వాతావరణంలో రానున్న ఈ సినిమాకి జనాల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. శతమానం భవతి షేం సతీష్‌ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాను కూడా సంక్త్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ వెల్లడించింది. 


ఇది ఇలా ఉండగా ఈ సంక్రాంతికి పోటీగా రెండు సినిమాలు బరిలో ఉన్నాయి. అవి కూడా స్టార్ హీరోల సినిమాలే. ఈ రెండు సినిమాలకు పోటీగా కళ్యాణ్ రామ్ సినిమా ఎంతమంచివాడవురా సినిమా బరిలోకి రానుంది. రెండు పెద్ద తలల ముందు ఈ సినిమా ఆగుతుందా. స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోల సినిమాను కాదని ఈ సినిమా పై జనాలు మొగ్గు చూపుతారా అనే విషయం తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: