ఈచిత్రం తరువాత వరుణ్ తేజ్ ,వెంకీ అట్లూరి తో సినిమా చేయనున్నాడని సమాచారం. ఇటీవల వెంకీ ,వరుణ్ కు కథ వినిపించాడట. ఆకథ బాగా నచ్చడంతో వరుణ్ వెంటనే సినిమా ఓకే చెప్పాడని సమాచారం. ఇది కూడా రొమాంటిక్ ఎంటర్ టైనరే అని తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలిప్రేమ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ ఇటీవల గద్దల కొండ గణేష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తో మొదటి వారం బాగానే వసూళ్లను రాబట్టుకుంది. అయితే ఆతరువాత సైరా విడుదలకావడంతో ఈ చిత్రం అనుకున్న స్థాయిలో లాభాలను తీసుకురాలేకపోయింది. ఇక ఎఫ్ 2 ఓవర్సీస్ లో కూడా బ్లాక్ బ్లాస్టర్ హిట్ అనిపించుకుంది కానీ గద్దల కొండ గణేష్ అక్కడి ప్రేక్షకులను మెప్పించలేదు. దాంతో ఈ చిత్రం యూఎస్ లో డిజాస్టర్ అయ్యింది.