డైరెక్ట‌ర్‌గా బాగా పేరు వ‌చ్చి న‌ట‌న పైన ఉన్న ఆస‌క్తితో సినిమా హీరోలుగా మారుతున్న డైరెక్ట‌ర్లు ఎంతో మంది ఉన్నారు. అందులో కొంద‌రు ఏదో చిన్న‌పాటి పాత్ర‌తో కాసేపు అలా సినిమాలో క‌నిపించేవారు కొంద‌రైతే మ‌రికొంద‌రు పూర్తి నిడివిలో  ఏకంగా హీరోగా న‌టిస్తున్నారు. 


అలా అనాధిగా తీసుకుంటే సినిమా న‌ట‌న‌పైన ఆస‌క్తి పెంచుకున్న డైరెక్ట‌ర్లు ఏదో ఒక చిన్న చిన్న పాత్ర‌ల్లో అప్పుడుప్ప‌డు సినిమాల్లో న‌టిస్తూ త‌ళుక్కుమ‌న‌డం సాధార‌ణ‌మే.  గ‌తంలో దాస‌రిగారి ఎమ్మెల్యే ఏడుకొండ‌లు, పోలీస్‌వెంక‌ట‌స్వామి, ఎర్ర‌బ‌స్సు ఇలా చెప్పుకుంటే పోతే చాలా సినిమాలు అటు డైరెక్ట‌ర్‌గా ఇటు హీరోగా ఆయ‌న అవార్డులు అందుకున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇలా పాత ద‌ర్శ‌కులు ఎంద‌రో ఉన్నారు. దాస‌రినారాయ‌ణ‌రావు, కోడిరామ‌కృష్ణ‌, ఎస్‌.వి. కృష్ణారెడ్డి ఇలా చెప్పుకుంటే చాలా మందే ఉన్నారు.  బాహుబ‌లి లో రాజ‌మైళి, పూరీజ‌గ‌న్నాధ్ శ్రీ‌నువైట్ల‌, అనీల్‌రావిపుడి, వి.వి.వినాయ‌క్ ఇలా ఎంద‌రో ద‌ర్శ‌కులున్నారు. అంత‌టితో స‌రిపెట్టుకోక డైరెక్ట‌ర్లు హీరోలుగా న‌టించ‌డానికి ఆశ‌క్తిని చూపుతున్నారు. హీరో భాగ్య‌రాజ్ కూడా ఎన్నో చిత్రాల‌కు ద‌ర్శ‌త్వం వ‌హించి న‌టించారు. అప్ప‌ట్లో ఎస్‌.వి. కృష్ణారెడ్డి మంచి ఫ్యామిలీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఇటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు అటు లేడీ ఆడియ‌న్స్‌కు ద‌గ్గ‌ర‌య్యారు.  శుభ‌ల‌గ్నం, మావిచిగురు, నెం.1, కొబ్బ‌రిబొండం, మాయ‌లోడు లాంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసిన ఎస్‌.వి. కృష్ణారెడ్డి ఉగాది చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. 


ఇలా తీసుకుంటే ఇటీవ‌లె మంచి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన చిత్రం అర్జున్‌రెడ్డి యూత్‌ను ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ మీకు మాత్ర‌మే చెపుతా చిత్రంతో హీరోగా మారాడు.  అర్జున్‌రెడ్డి  లాంటి భారీ విజ‌యాన్ని సాధించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్‌కు మ‌హేష్‌బాబు డేట్స్ కూడా ఉన్న త‌రుణంలో హీరోగా మారారు మీకు మాత్ర‌మే చెపుతా చిత్రానికి నిర్మాత‌గా క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ నిర్మాత‌గా వ్య‌వ‌హిరిస్తున్నారు. ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు అగ్ర‌ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ సేన‌య్య అనే చిత్రంతో హీరో గా మారారు. వెండితెర‌కు మరో ద‌ర్శ‌కుడు హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో జ‌ర‌గ‌డం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: