తెలుగు నాట అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న గేమ్ షో బిగ్ బాస్ .అయితే బిగ్ బాస్ చివరి అంకానికి వచ్చేసింది. వందరోజులకి మరికొంత దూరంలో మాత్రమే ఉంది. ఈ తరుణంలో వారం వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ట్విస్ట్  లు చోటు చేసుకోనున్నాయి. ప్రేక్షకులు ఎవరికి ఓట్లేస్తారనేది చెప్పలేకుండా ఉంది. దీంతో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఊహించలేకపోతున్నారు. ఈ వారం నామినేషన్ లోకి వచ్చన వితికా తన మెడాలియన్ ని ఉపయోగించి నామినేషన్ నుండి తప్పించుకుంది.


నామినేషన్ లో ఉన్న ముగ్గురిలో ఎవరు బయటకి వెళ్ళిపోతారనేది తేలట్లేదు. బాబా భాస్కర్, శ్రీముఖి అభిమానులు మహేష్ విట్టకి ఓటింగ్ చేయాలని భావించారు. అయితే కొంతమంది అలా ఆలోచిస్తున్నప్పటికీ మరికొంత మంది మాత్రం అలా చేయడం వల్ల వరుణ్ గ్రూపు వారికి హెల్ప్ అయ్యి వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు.


ఎందుకంటే వరుణ్ మిత్రబృందంలో నుండి వెళ్ళిపోయిన పునర్నవి ప్రేక్షకులని తన  గ్రూపు వారికే ఓట్లేయమని సోషల్ మీడియాలో క్యాంపేన్ రన్ చేస్తుంది. ఇప్పుడు వరుణ్, రాహుల్ లలో కూడా ఎవరైనా వెళ్ళిపోతే వారి అభిమానుల ఓట్లు కూడా మిగిలిన ఇద్దరికే వేయమని చెప్తారు. దీనివల్ల ఓటింగ్ లో చీలిక రాకుండా వారి అభిమానుల ఓట్లు మొత్తం ఆ గ్రూపు వారికే పడి వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది.


అందువల్ల వీరిద్దరినీ కాపాడి మహేష్ ని ఎలిమినేట్ చేయాలని చుస్తున్నారు. ఎలిమినేషన్ లో ఎవరి విశ్లేషణలు వారికి ఉండడంతో ఎవరు ఎవరికి ఓటేస్తారనేది తెలియకుండా పోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ డబల్ ఎలిమినేషన్ చేస్తే గనక అది ఊహించని పరిణామమే అవుతుంది. మరి ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: