తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంత కోలాహలంగా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో టాలీవుడ్ లో కూడా కొత్త సినిమాలతో స్టార్ హీరోలు. పోటీలు పడుతుంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ భలే సందడి నెలకొనబోతుంది.  స్టార్ హీరోల సినిమాలు ఒకటి కారు రెండు కాదు వరుస బెట్టి రాబోతున్నాయి.  సాధారణంగా ప్రతీ సంక్రాంతికి టాలీవుడ్ లో మూడు నుండి నాలుగు సినిమాలు విడుదలవ్వడం చూస్తూనే ఉన్నాం.

అయితే ఈ సినిమాలు రిలీజ్ అయ్యే నాటికి థియేటర్ల ఇబ్బందులు కూడా తలెత్తుంటాయి. అందుకే మూడు, నాలుగు సినిమాలు విడుదలవుతాయి కాబట్టి ఆయా సినిమాల నిర్మాతలు ముందుగానే ఒప్పందం చేసుకుని ఏ సినిమా ముందు రావాలి ఏ సినిమా తర్వాత రావాలి అన్న నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ నటించిన  అల వైకుంఠపురములో, మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీస్ రిలీజ్ విషయంలో తర్జనభర్జన జరుగుతున్నాయి.

రెండూ సంక్రాంతికి వస్తున్నా ముందు ఎవరు రావాలి, వెనక్కి ఎవరు వెళ్ళాలి అన్న మీమాంస కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు కూడా జనవరి 11వ తేదీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.  ఇలా రిలీజ్ చేస్తే కలెక్షన్ల పరంగా దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. వరూ కూడా పండగ అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకోలేరు. మరి వచ్చే ఏడాది లోగా ఇద్దరు నిర్మాతలు కలిసి చర్చించుకుంటారా లేక పంతాలకు పోతారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: