హిందీలో బాగా రచ్చ జరిగి చర్చనీయాంశంగా మారి యూత్ నే కాదు 60 ఏళ్ళలో ఉన్న వాళ్ళని కూడా ఉద్వేగపరచిన హిందీ హాట్ వెబ్ సీరిస్ 'లస్ట్ స్టోరీస్'. ఒకప్పుడు పోర్న్ సైట్స్ లో వెతుక్కునే కొన్ని లక్షల మందికి ఇలాంటి సిరీస్ అటువైపు చూడకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరిస్ ను తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అవుతుందని లేటెస్ట్ న్యూస్. హిందీలో కియరా అద్వానీ చేసిన పాత్రకు తెలుగులో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. బోల్డ్ గా, రా గా నటించాల్సిన ఆ పాత్రకు అమలపాల్ ని  ఎంపిక చేసినట్టుగా తాజా సమాచారం. నందినీ రెడ్డి దర్శకత్వంలో లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ రూపొందనుందని ఫ్రెష్ అప్‌డేట్. 

హిందీలో ఈ వెబ్ సీరిస్ బోలెడన్ని వీక్షణలను పొందింది. భర్త నుంచి సెక్స్ లో అసంతృప్తి పొందుతున్న ఒక ఆధునిక మహిళ పాత్రలో కియరా అద్వానీ నటించింది. అందుకు సంబంధించిన సన్నివేశాలను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారు. లస్ట్ స్టోరీస్ లో నటించిన సమయంలో కియరాకు ఇంత పాపులారిటి లేదు. ఒకవేళ అదే లస్ స్టోరీస్ ఆఫర్ ఇప్పుడు గనకైతే చేసేదో కాదో గాని అప్పుడు మాత్రం జనాలకి పిచ్చెక్కించింది.

అయితే ఆ వెబ్ సీరిస్ హిట్ కావడంతో.. కియరా అద్వానీకి చాలా పేరు వచ్చేసింది. అందులో నటించినందుకు గర్వంగా ఉందన్నట్టుగా కూడా ఆమె ప్రకటనలు చేసుకుంది. ఇక ఇటీవలే తమిళ సినిమా 'ఆడై'లో నగ్నంగా నటించినట్టుగా ప్రకటించుకుంది అమలపాల్. అది తనకు గర్వకారణం అన్నట్టుగా 'ఆమె' చెప్పుకుంది. ఈ నేపథ్యంలో అమలపాల్ ను లస్ట్ స్టోరీస్ రీమేక్ కు దర్శకురాలు నందినీ రెడ్డి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సీరిస్ ఫస్ట్ పార్ట్ కు నందిని దర్శకత్వం వహించనుంది. ఈ భాగంలో జగపతి బాబు కూడా ఒక కీలకపాత్ర పోషించబోతున్నాడని సమాచారం. అయితే బాలీవుడ్ జనాలకు ఇలాంటివి చాలా కామన్ గాని మన ప్రేక్షకులకు ఇవి ఎంతవరకు నచ్చుతాయో చూడాలి. ఏదేమైనా ట్రెండ్ మారుతోంది అంటే ఇదేనేమో..! 


మరింత సమాచారం తెలుసుకోండి: