టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిన సాహో సినిమా, ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అంతకముందు దర్శకధీరుడు రాజమౌళి దర్శకతంలో ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు, ఎంతో అద్భుత విజయాన్ని అందుకోవడం, అలానే సాహో కు విపరీతమైన ఖర్చు పెడుతుండడంతో, ప్రేక్షకులు ఆ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలు సాహో అందుకోలేకపోవడంతో, ప్రస్తుతం నటిస్తున్న జాన్ సినిమాపై మరింత దృష్టి పెట్టారు ప్రభాస్. 

ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, జిల్ మూవీని తెరకెక్కించిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కెరీర్ మరియు పర్సనల్ విషయాలను పంచుకున్న ప్రభాస్, ఫ్యాన్స్ అందరికి ఒక షాకింగ్ విషయం చెప్పారు. నిజానికి తాను సినిమాల్లోకి రావడం తన తల్లికి పెద్దగా ఇష్టం లేదని, 

తాను ఏదైనా మంచి ఉద్యోగమో లేక వ్యాపారమో చేసి, చక్కగా పెళ్లి చేసుకుని మంచి ఇల్లు కట్టుకుని ఫ్యామిలీతో హాయిగా ఉండాలని ఆమె కోరుకుందని అన్నారు. అయితే చిన్నప్పటి నుండి పెదనాన్న కృష్ణంరాజు గారి సినిమాలు ఎంతో ఇష్టపడే తనకు, సినిమా రంగంవైపు రావాలనే కోరిక కలిగి ఇండస్ట్రీకి రావడం జరిగిందని అన్నారు. ఇక బాహుబలి సినిమాల అద్భుత విజయాల తరువాత తన తల్లి చెప్పిన ఒక మాట ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు ప్రభాస్. మనకు ఎంత గొప్ప పేరు వచ్చినప్పటికీ మనం మాత్రం ఎప్పటికీ ఒదిగే ఉండాలనే గొప్ప విషయాన్ని తన తల్లి చెప్పారని, తాను ఎప్పటికీ ఆ విధంగానే జీవిస్తానని ప్రభాస్ చెప్పారు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: