ఈటివిలో సక్సెస్ ఫుల్ డ్యాన్స్ షో ఢీ 11 సీజన్లను పూర్తి చేసుకుని 12వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఢీ నుండి ఢీ జోడీ అంటే దాదాపుగా 11 సీజన్లలో ఎంతోమంది టాలెంటెడ్ డ్యాన్సర్స్ ను.. డ్యాన్స్ మాస్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది ఈ షో. సౌత్ లో ది బెస్ట్ డ్యాన్స్ షోగా ఢీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు సుధీర్, రష్మిల క్రేజీ కామెడీ, ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ ఈ షోకి ప్లస్ అని చెప్పొచ్చు.  


ఢీ 10, ఢీ జోడీ సీజన్లకు యాంకర్ గా ప్రదీప్ చేశాడు. ఆ రెండు సీజన్లకు సుధీర్, రష్మిలు టీం లీడర్స్ గా ఉన్నారు. అయితే ఢీ 12వ సీజన్ ఢీ ఛాంపియన్స్ కు క్యాలిక్యులేషన్స్ మారిపోయాయి. ఢీ అంటే ఎప్పుడూ ప్రదీప్ యాంకరింగ్.. సుధీరి, రష్మిలు టీం లీడర్స్ అన్న టాక్ వచ్చింది. అందుకే ఈసారి ప్లాన్ మార్చేశారు.        


ఢీ ఛాంపియన్స్ లో సుధీర్, రష్మిలు యాంకర్లుగా మారారు. ఇక ఈ సీజన్ కు ప్రత్యేకంగా పటాస్ రవి, వర్షిణిలు టీం లీడర్స్ గా వచ్చారు. శ్రీముఖి బిగ్ బాస్ కు వెళ్లాక పటాస్ షోలో వర్షిణి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆల్రెడీ అంతకుముందు ఢీ జోడీకి ఆమె టీం లీడర్ గా ఉంది. అందుకే రవి, వర్షిణిలను టీం లీడర్స్ గా చేసి సుధీర్, రష్మిలను ఢీ ఛాంపియన్స్ యాంకర్లుగా చేశారు.  


ఎవరున్నా ఎవరు లేకున్నా సుధీర్, రష్మిలు మాత్రం ఉండాల్సిందే. వారిద్దరిని తీసేస్తే షోకి ఉన్న క్రేజ్ తగ్గిపోతుందని వారిని ఈసారి టీం లీడర్స్ గా కాకుండా యాంకర్స్ గా పెట్టారు. అయితే టీం లీడర్స్ అయినా యాంకర్లుగా అయినా వారిద్దరు ఉంటే ఆ షోకి వచ్చే పాపులారిటీ వేరు. అందుకే తెలివిగా ప్రదీప్ ను తప్పించి వీరిద్దరిని యాంకర్లుగా చేశారు. అయితే ప్రదీప్ ఈ షో నుండి తప్పుకున్నా మిగతా షోలతో బిజీగా ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: