శేఖర్ కమ్ముల తీసిన డాలర్ డ్రీంస్ నుండి ఫిదా వరకు తన సినిమాలేవీ పూరి జగన్నాధ్ లా 3-4 నెలల్లో షూట్ పూర్తిచేసుకొని రిలీజ్ అయిన సందర్భాలు లేవు. ఈ విషయం అందరికి తెలిసిందే. మరి అలాంటప్పుడు నాగచైతన్య, సాయిపల్లవిని హీరోహీరోయిన్లుగా స్టార్ట్ చేసిన కొత్త సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని గ్రాండ్ గా ఎలా ప్రకటించారో తెలీడం లేదు. మొత్తానికి ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. మరో 2 నెలల్లో ఈ సినిమాను సిద్ధం చేయడం కష్టమని తెలియడంతో శేఖర్ కమ్ముల..2020 కి పోస్ట్ పోన్ చేశాడు.

నిజానికి ఇది ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన సినిమా కాదన్న విషయం కూడా తెలిసిందే. ఇంతకుముందే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు శేఖర్ కమ్ముల. 
ఎప్పట్లానే కొత్త హీరోహీరోయిన్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. కాకపోతే వాళ్ల నుంచి ఎక్స్ ప్రెషన్స్ రాబట్టడం ఈయన వల్ల కాలేదు. పైగా ఇది డాన్స్, మ్యూజిక్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించే సినిమా. ఫిదా మాదిరిగా తెలంగాణ యాస డైలాగ్స్ కూడా ఉన్నాయి. అందుకే కొత్త వాళ్లతో తీయలేకపోయాడట. దీంతో దాదాపు 6 నెలల పాటు వెయిట్ చేసి, చివరికి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ఇప్పుడు అదే కథతో చైతూ-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా స్టార్ట్ చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించిన సీన్లు అన్నీ ఇప్పటికే షూట్ చేయడంతో.. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల్ని షూట్ చేస్తే సరిపోతుందనుకున్నాడు శేఖర్ కమ్ముల. అందుకే డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. 

కానీ జనాలకు మాత్రం అంత ఈజీగా అవుతుందా..అదీ శేఖర్ కమ్ముల తో..అంటు ఈ సినిమాపై అనుమానాలు అలానే ఉన్నాయి. డిసెంబర్ లో విడుదల చేయలేడని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమని తేలింది. అందరు అనుకున్నట్టుగానే దర్శకుడు సినిమాను వాయిదావేశాడు. డిసెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పటికీ కొంత ప్యాచ్ వర్క్ మిగిలే ఉంటుందని అంటున్నారు. జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలనేది ప్రస్తుతం చిత్ర బృందం వేసుకున్న ప్లాన్. ఇక ఈ సినిమాతో ఏషియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: