తమిళ హీరో శింబు ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ హీరోకి వివాదాలు చాలా కామన్. ఆయన కూడా వీటిని ఎందుకనో చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. సాధారణంగా అయితే హీరోగా ఫేం వచ్చాక చిన్న మచ్చ కూడా తన మీద పడకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అవసరమైతే జనాల్లోకి కూడా ఎక్కువగా రాకుండా ఉంటారు. కానీ ఈ హీరో మాత్రం మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే చాలా వివాదాల్లో శింబు పేరు వైరల్ అవుతుంది.   ఈ నేపథ్యంలో తాజాగా శింబు ప్రవర్తన మీద ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా కోలీవుడ్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. శింబును హీరోగా పెట్టి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు జ్ఞానవేల్ రాజా. అయితే శింబు సహకరించడం లేదని, టైం కి షూటింగులకు రావడం లేదని జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు చేస్తూ తనకు భారీ నష్టం వచ్చిందని కూడా పేర్కొన్నాడు.

శింబు వేళకు షూటింగులకు వచ్చేవాడు కాదని..దీంతో కాంబినేషన్లో సీన్లను షూట్ చేయడం బాగా కష్టమైందని ఆ నిర్మాత పేర్కొన్నాడు. మిగతా నటీనటులు కూడా శింబు రాకపోవడంతో ఇబ్బంది పడ్డారని, వారు సినిమా కోసం ఎక్కువ రోజులు పని చేయాల్సివస్తోందని.. శింబూతో కాంబినేషన్ల కోసం వారు అదనపు కాల్షీట్లను కేటాయించాల్సి వస్తోందని నిర్మాత గోడు వెల్లబోసుకున్నాడు.

అందుకే వాళ్ళకి అదనంగా డబ్బు ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నాడు. టైం కి షూటింగ్స్ రాకపోవడంతో శింబు తనకు భారీ నష్టాన్ని తెస్తున్నాడని ఆ నిర్మాత మండలిలో ఫిర్యాదు చేశాడు. వాస్తవంగా అయితే గతంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్లు ఇలా నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి గాని...శింబు హీరోగా నటిస్తున్న సినిమాకే ఇలాంటి షాక్ లు ఇస్తూ వివాదంలో ఇరుక్కున్నాడు శింబు. మరి దీని మీద శింబు ఎలాంటి క్లారిటి ఇస్తాడో చూడాలి. అన్నట్టు శింబు తండ్రి కూడా ఎప్పుడు ఏదో వివాదంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు శింబు.


మరింత సమాచారం తెలుసుకోండి: