ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి ఇటీవల గాంధీ మహాత్ముని 150వ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం సైరా మూవీ చాలా వరకు బోల్తాకొట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా అత్యధిక రన్ టైం ఈ సినిమాకు కొంత దెబ్బేయగా, సినిమా మధ్యలో చిన్నపాటి ల్యాగ్స్ ఉండడం, 

అలానే కొన్ని గ్రాఫిక్స్ తేలిపోవడం వంటివి సినిమాను యావరేజ్ దగ్గరే ఆపేశాయి. ఇక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన అత్యద్భుత నటనతో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించడంతో సైరా టీమ్ నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో పెద్ద పార్టీని ఇవ్వడం జరిగింది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు తదితరులు ప్రత్యేకంగా విచ్చేసిన ఈ పార్టీలో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రత్యేకంగా దర్శనమిచ్చారట. ఇక సైరా టీమ్ మొత్తాన్ని ఎంతో మెచ్చుకున్న బాలయ్య, మెగాస్టార్ తో అలానే చరణ్ తో కలసి చాలాసేపు ముచ్చటించారని, 

అలానే వెంకటేష్ తో కలిసి ఆయన కొద్దిసేపు ఎంతో సరదాగా మాట్లాడినట్లు సమాచారం. నిజానికి మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు ఉండడం వలన ఒకరి ఫ్యామిలీ వేడుకలకు మరొకరు హాజరు కారు అనే రూమర్లు స్ప్రెడ్ అయిన ప్రతీ సారి, ఈ రెండు ఫ్యామిలీలు ఏదో ఒక సందర్భంలో ఈ విధంగా కలిసి సందడిచేస్తూ, అవన్నీ ఒట్టి పుకార్లే అని తేల్చేస్తుంటాయి. ఇక బాలయ్యతో కలసి మెగాస్టార్ కూడా ఎంతో సరదాగా మాట్లాడారట. కొందరికి అది షాకింగ్ గా అనిపించినప్పటికీ, ఆ సన్నివేశం ఎంతో కన్నులవిందుగా ఉందని అంటున్నారు సినీ అభిమానులు. కాగా ప్రస్తుతం ఆ పార్టీ తాలూకు ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: