టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట కథ,మాటల రచయితగా పరిచయమయిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత మెల్లగా తన పదునైన పంచ్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకు తన తొలి సినిమా నువ్వే నువ్వే ను యువ హీరో తరుణ్ తో కలిసి తెరకెక్కించారు త్రివిక్రమ్. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, దర్శకుడిగా త్రివిక్రమ్ కు మంచి పేరు తీసుకువచ్చింది. అయితే వెను వెంటనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని దర్శకత్వం వహించే గొప్ప ఛాన్స్ పట్టేసిన త్రివిక్రమ్, ఆయనతో కలిసి అతడు సినిమాను తెరకెక్కించడం జరిగింది. 

ఆ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో, టాలీవుడ్ లో త్రివిక్రమ్ కు వరుసగా ఆఫర్లు పెరిగాయి. అనంతరం పవన్ కళ్యాణ్ తో జల్సా, మహేష్ తో ఖలేజా, బన్నీతో జులాయి నుండి మొన్నటి ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత వరకు హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ని కూడా ఎదుర్కొన్నారు త్రివిక్రమ్. అయితే ఆయన కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకుల దృష్టిలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయే సినిమాల్లో ముందు వరుసలో నిలిచేవి, సూపర్ స్టార్ మహేష్ తో ఆయన చేసిన అతడు మరియు ఖలేజా సినిమాలే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆ సినిమాలు ప్రేక్షకుల్లో వేసిన ముద్ర ఇప్పటికీ కూడా పోలేదు. 

ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాలు టీవీలో ప్రసారం అయిన ప్రతి సారీ మంచి రేటింగ్స్ సంపాదిస్తుండడం విశేషం. అయితే అందులో అతడు హిట్ కొట్టినప్పటికీ, ఖలేజా మాత్రం బోల్తా కొట్టింది. అయితే 2010లో త్రివిక్రమ్, మహేష్ ల కలయికలో వచ్చిన ఖలేజా తరువాత వారిద్దరి కాంబోలో మరొక సినిమా రాలేదు. అయితే ఎక్కువమంది ప్రేక్షకులు మాత్రం, మరొక్కసారి వారిద్దరూ కలసి మరొక సినిమా చేస్తే చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ కూడా తమ ప్రస్తుత సినిమాలతో బిజీగా ఉండడంతో రాబోయే రోజుల్లో అయినా వారిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: