టాలీవుడ్ సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క అపజయం కూడా చూడని
అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయాలనే తలంపుతో ఎంతో కష్టపడి దీనిని తెరకెక్కిస్తున్నారట.
మహేష్ సరసన
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా, సీనియర్ నటి
విజయశాంతి గారు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రీఎంట్రీ ఇస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.
మహేష్ బాబు,
అనిల్ సుంకర, దిల్ రాజు లు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో సాంగ్స్ ఎంతో బాగా కుదిరాయని అంటున్నారు. ఇక సినిమాలో వచ్చే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో మిల్కి
బ్యూటీ తమన్నా
మహేష్ తో కలిసి నటిస్తుండగా, సినిమా మొత్తానికి పెద్ద హైలైట్ గా నిలిచే మాస్ సాంగ్ లో, ఇటీవల
మహేష్ తో కలిసి
మహర్షి లో నటించిన పూజ హెగ్డే చిందేయనుందట. పక్కా ఊర మాస్ స్టైల్ లో సాగె ఈ సాంగ్ లో
మహేష్ మరియు పూజలు ఇరగదీయనున్నారని,
ఇప్పటికే ఈ సాంగ్ కోసం ఒక ప్రత్యేక సెట్ ని కూడా రూపొందించినట్లు సమాచారం. అలానే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా ఈ సాంగ్ కి అదిరిపోయేలా ట్యూన్స్ ఇవ్వడం జరిగిందని అంటున్నారు. రేపు సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ లో ఈ సాంగ్
మహేష్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని కూడా ఒక ఊపు ఊపడం ఖాయమని అంటున్నారు. అంతేకాక సినిమాలోని మిగతా సాంగ్స్ కూడా అదిరిపోయాయని, రేపు ఆడియో రిలీజ్ తరువాత సాంగ్స్ మొత్తం ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయయమని అంటున్నారు. మరి ఈ వార్త నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్తే అనాలి.....!!