అటు హిందీతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది కియారా అద్వానీ. పగ్లి సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కియారా... స్టార్ హీరోయిన్ గా ఎదిగింది . తెలుగులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను లో మెరిసింది.ఆ తర్వాత టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ లో మెడిసినప్పటికీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక హిందీలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి రీమేక్ గబ్బర్ సింగ్ లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది కియరా అద్వాని.
ఇక కబీర్ సింగ్ సెన్సేషన్ హిట్ తర్వాత... వరుస ఆఫర్లు వచ్చి కీయారా ముంగిట వాలయి .ఇప్పటికే అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూస్, లక్ష్మీబాంబ్ సినిమాలలో కీలక పాత్రల్లో కనిపించనుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో కాంచన సినిమాకు రీమేక్ గా వస్తుంది లక్ష్మీ బాంబ్. ఇది వచ్చే ఏడాది జూన్ 5 న విడుదల కానుంది. అయితే అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హర్రర్ మూవీ చంద్రముఖి... హిందీలో బోల్ భులాయ్యా అనే పేరుతో రీమేక్ అయ్యి విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా బోల్ భులాయ్యా 2 తీయబోతున్నారు. అయితే రజిని పాత్రలో బోల్ భులాయ్యా 2 సినిమాలో యువ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తుండగా... లేడీ సూపర్ స్టార్ నయనతార పాత్రలో అందాల భామ కియారా నటిస్తుంది. ఈ సినిమాకు అనీస్ బాజ్మి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ నిన్న ప్రారంభించగా... వచ్చే సంవత్సరం జూలై 31 న ఈ సినిమా విడుదల కాబోతోంది.