ప్రభాస్ ‘సైరా’ మూవీని చూసి సురేంద్ర రెడ్డిని మెచ్చుకుని తనకు ఒక మంచి కథ చెప్పమని అడిగిన రెండు రోజులలోనే సురేంద్ర రెడ్డి ప్రభాస్ కోసం ఇప్పుడు ఒక జేమ్స్ బాండ్ కథను తయారుచేసి వినిపించడం హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు సురేంద్ర రెడ్డి గతంలో మహేష్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసుకున్న ఒక జేమ్స్ బాండ్ కథ ఇప్పుడు ప్రభాస్ అంగీకారం కోసం ఎదురు చూస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.

సురేంద్ర రెడ్డి చెప్పిన ఈ స్టోరీ లైన్ ప్రభాస్ కు నచ్చడంతో ఆ లైన్ ను డెవలప్ చేసే పనిలో ప్రస్తుతం సురేంద్ర రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు ఇప్పటికే ఏర్పడిన నేషనల్ స్టార్ ఇమేజ్ వల్ల అతడు జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తే ఈజీగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని సురేంద్ర ఆలోచన అని అంటున్నారు. 

దీనికితోడు ఈ మధ్య కాలంలో తెలుగులో కానీ హిందీలో కాని జేమ్స్ బాండ్ సినిమాలు వచ్చి చాల రోజులు అయింది. దీనితో ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటూ జేమ్స్ బాండ్ పాత్రను ప్రభాస్ చేత చేయిస్తే సులువుగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వచ్చు అని సురేంద్ర రెడ్డి చెప్పిన యాక్షన్ ప్లాన్ కు ప్రభాస్ ఆసక్తి కనపరిచినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి రాజమౌళి ఎప్పటి నుంచో మహేష్ తో ఒక భారీ జేమ్స్ బాండ్ మూవీని తీయాలనే ఆలోచనలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని రాజమౌళి ఓపెన్ గా ప్రకటించాడు. అయితే రాజమౌళి మహేష్ తో తీయాలనుకున్న ఈ ప్రయోగం ఇప్పుడు సురేంద్ర రెడ్డి ప్రభాస్ తో చేయబోతు ఉండటంతో భవిష్యత్ లో రాజమౌళి మహేష్ తో సినిమా చేయడానికి మరొక కొత్త జోనర్ ను ఆలోచించుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: