కే జి ఎఫ్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఒక్క సినిమాతోనే దక్కించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో చాలామంది స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పనిచేయడానికి అప్పట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వం చేయబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో  సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. భరత్ అనే నేను, మహర్షి లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న...మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న మహేష్ ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రశాంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


తన దగ్గర ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ గురించి మహేష్ తో డిస్కస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడట. మహేష్ కూడా సక్సెస్ ఫుల్ దర్శకుడు కాబట్టి కథ వినేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.  ఆ తరువాత KGF2 అయిపోగానే మహేష్ తో వచ్చే ఏడాది కొత్త మూవీ స్టార్ట్ చేయాలనీ ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి మహేష్ కి ప్రశాంత్ నీల్ స్టోరీ నచ్చుతుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: