మెగా హీరోల్లో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఈ ఇయర్ ఆల్రెడీ ఎఫ్-2తో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ తో దుమ్ముదులిపేశాడు. ఇన్నాళ్లు కెరియర్ లో సాఫ్ట్ రోల్స్ వేసిన వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ గా మాస్ క్యారక్టర్ లో అదరగొట్టాడు. సినిమా సినిమాకు వరుణ్ తేజ్ రేంజ్ పెరుగుతుందని చెప్పొచ్చు.   


వరుస విజయాలు వరుణ్ తేజ్ డిమాండ్ పెరిగేలా చేసింది. దర్శక నిర్మాతలు వరుణ్ తేజ్ తో సినిమా కోసం క్యూలు కడుతున్నారు. అందుకే ఇదే కరెక్ట్ టైం అని వరుణ్ తేజ్ కూడా తన రెమ్యునరేషన్ పెంచినట్టు టాక్. మొన్నటివరకు సినిమాకు 4 నుండి 5 కోట్ల వరకు తీసుకునే వరుణ్ తేజ్ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లు పడే సరికి ప్రస్తుతం సినిమాకు 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.  


వరుణ్ తేజ్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టుగా ఉంది. అందుకే నిర్మాతలు సైతం వరుణ్ అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సరే అంటున్నారట. ఎలా లేదన్నా వరుణ్ తేజ్ సినిమా 20 కోట్లలో పూర్తి చేసి టేబుల్ ప్రాఫిట్ గా 25 నుండి 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యొచ్చు. సినిమా హిట్టైతే ఆ మొత్తం రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు. ప్రస్తుతం మెగా హీరోల్లో చిరంజీవి, రాం చరణ్, అల్లు అర్జున్ తర్వాత మంచి ఫాంలో ఉన్న హీరో ఎవరంటే వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు.     


వరుణ్ తేజ్ తో సమానంగా కెరియర్ ప్రారంభించిన సాయి తేజ్ కూడా వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత చిత్రలహరితో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సాయి తేజ్ ప్రతిరోజు పండుగ సినిమా చేస్తున్నాడు. మారుతి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. వరుణ్ తేజ్, సాయి తేజ్ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఏర్పడేలా ఉన్నా ఎవరికి వారు తమ ఓన్ టాలెంట్ తో సత్తా చాటుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: