బ్యాక్లెస్ వీడియోతో సోషల్ మీడియాను ఊపేస్తుంది ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ జూహీ చావ్లా. హర్యానా లోని అంబాలాలో 13 నవంబరు 1967న పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు జుహీ. ఆమె తండ్రి భారతీయ రెవెన్యూ సర్వీస్ అధికారిగా పనిచేసేవారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కైరా అద్వాణీ కి ఈమె స్వయానా ఆంటీ.
ఆమె హిందీ భాషలోనే కాక, పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా సినిమల్లో నటించింది. జూహీ చావ్లా తెలుగులో నాగార్జున హీరోగా నటించిన ‘విక్కీ దాదా’, ‘శాంతి క్రాంతి’ సినిమాల్లో కూడా కథానాయికగా నటించింది. ఆ తర్వాత కృష్ణ, రమేష్ బాబు హీరోలుగా నటించిన ‘కలియుగ కర్ణుడు’ సినిమాలో రమేష్ బాబు సరసన జంటగా నటించి మెప్పించింది. ఇక మెగాస్టార్
చిరంజీవి ఫస్ట్ టైమ్ హిందీలో హీరోగా నటించిన ‘ప్రతిబంధ్’లో కూడా చిరు సరనసన నటించింది.
ఆ తర్వాత ‘ది జెంటిల్మెన్’ సినిమాలో కూడా ఆడిపాడింది. అప్పట్లో ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. జూహీ చావ్లా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ‘డర్’ చిత్రంలో ఆమె వర్షంలో తడిసిన తర్వాత బట్టలు మార్చుకునే సీన్........ ఇప్పుడు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. ఇక ఈ సినిమాతోనే హీరోగా షారుఖ్ ఖాన్ లైఫ్ టర్న్ తీసుకుంది. ఈ సినిమాలో 'తూ మేరి కిరణ్' అంటూ షారుఖ్ చేసిన నటనకు జుహీ అందాలు తోడై ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
ఆమె సినిమాలలోనే కాకుండా 1984లో జరిగిన మిస్
ఇండియా పోటీల్లో విజేతగా గెలిచారు. 1995లో పారిశ్రామికవేత్త జయ్ మెహతా ను వివాహం చేసుకున్న ఆమె తర్వాత హీరోయిన్ వేషాలకు గుడ్ బై చేప్పారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం మనందరికి తెలిసిందే.