హన్సిక మోత్వానీ..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి పరిచయం చేసిన బ్యూటిఫుల్ హీరోయిన్. అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని కితాబులిచ్చారు. కానీ ఎంతకాలమో ఇండస్ట్రీలో ఉండలేకపోయింది. ఈ బబ్లీ బ్యూటీ గత కొంత కాలంగా ఇటీవల కెరీర్ రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. అందుకు కారణం టాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్స్ పడటమే. అంతేకాదు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఈ బ్యూటీ కొన్ని తప్పులు చేసి ఆ స్టాటస్ కి దూరమైపోయింది. అయితే తమిళంలో మాత్రం అడపాదడపా స్టార్ల సరసన నటిస్తూ అలా ఏదో తన కెరీర్ ని నెమ్మదిగా లాకొచ్చుకుంటోంది. 

అయితే లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే ఈ బ్యూటి వివాదాస్పద క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ సరసన కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. హరి శంకర్- హరీష్ నారాయణ్ ద్వయం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. రంగనాథన్  ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డి హారర్ మూవీ అంబులి సినిమాని తెరకెక్కించిన ఈ బృందం హన్సిక- శ్రీశాంత్ జోడీతో మరో హారర్ కామెడీ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దర్శక, నిర్మాతలు ఇటీవలే శ్రీశాంత్ తో స్క్రిప్టును డిస్కస్ చేసినట్టు తాజా సమాచారం. చెన్నయ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక హన్సిక ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమాలో నటిస్తోంది. అలాగే పిల్ల జమీందార్ ఫేం అశోక్ తెరకెక్కించనున్న తెలుగు వెబ్ సిరీస్ కిట్టీలోనూ కీలక పాత్ర పోషించనుంది. ముంబైలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరగనుందని మరో లేటెస్ట్ న్యూస్. శ్రీశాంత్ ఇంతకుముందు అక్షర్ 2 అనే హిందీ సినిమాలో అలాగే టీమ్ 5 అనే మలయాళ సినిమాలోను నటించారు. ఈ రెండు సినిమాల తర్వాత హన్సిక తో కలిసి నటిస్తూండడం ఆసక్తి కరంగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: