బాలీవుడ్ టెలివిజన్ రంగంలో బాలనటిగా పలు సీరియల్స్ లో నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్.. హమ్ దో హై.. వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో.. వంటి సినిమాల్లో బాలనటిగా నటించింది. తర్వాత తెలుగు 2007లో పూరీజగన్నాథ్ తీసిన 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. టాలీవుడ్లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది. 2008లో జూనియర్
ఎన్టీఆర్ పక్కన 'కంత్రీ'లో ఆడిపాడింది.
రామ్తో 'మస్కా' మూవీలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత
ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ప్రియ'గా గెస్ట్ రోల్లో నటించింది. ఓ వైపు తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాల పైనా దృష్టి సారించింది. 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్', 'దేనికైనా రెడీ..', 'సమ్థింగ్.. సమ్థింగ్..' వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని పలకరిస్తూ.. హిట్లను తన ఖాతాలో జమ చేసుకుంది. తాజాగా తెలుగులో ప్రస్తుతం ‘తెనాలి
రామకృష్ణ బిఏ బిఎల్’ లో నటిస్తుంది. అటు తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ గానే ఉంది.
ఆ మధ్య'చంద్రకళ' లాంటి హర్రర్ జానర్ సినిమాలో నటించి సక్సెస్ అయింది. మళ్ళీ అలాంటి కధతోనే సినిమా చేయనుంది. ఇందులో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తాడని తెలుస్తోంది. అది కూడా విలన్ పాత్రలో కావడం విశేషం.
హరి శంకర్, హరీశ్ నారాయణ్ ఇద్దరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి రంగనాథన్ నిర్మాత. ఈ ముగ్గురు కలిసి స్క్రిప్ట్ చెప్పగానే శ్రీశాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. శ్రీశాంత్ గతంలో ‘టీమ్ 5’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.