టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కొన్నాళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత దేశ, విదేశాల్లో ఎంతో అత్యద్భుతమైన క్రేజ్ ని మరియు మార్కెట్ ని ఏర్పరుచుకోవడం జరిగింది. ఇక అదే ఊపుతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజా సినిమా సాహో పెద్దగా సక్సెస్ కానప్పటికీ, భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని మాత్రం రాబట్టగలిగింది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్ట్ చేయని ఈ సినిమా, నార్త్ లో మాత్రం బాగానే కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.350 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఆ సినిమాలో కేవలం, విజువల్స్ మరియు గ్రాఫిక్స్ అత్యధికంగా ఉండడం, 

అలానే సదరు ప్రేక్షకుడు ఆశించే ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో సాహో సక్సెస్ కాలేకపోయిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఆ సినిమా నేర్పిన గుణపాఠంతో హీరో ప్రభాస్, ప్రస్తుతం నటిస్తున్న జాన్ సినిమా విషయమై ఎంతో కేర్ తీసుకుంటున్నాడట. జిల్ మూవీ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోందట. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కు సంబంధించి ఒక వార్త, నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం అవుతోంది. అదేమిటంటే, 

1600వ సంవత్సరం సమయంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో ప్రభాస్, ఒక వయోలిన్ వాయిద్య కారుడిగా షాకింగ్ రోల్ లో నటిస్తున్నట్లు చెప్తున్నారు. మంచి లవ్ స్టోరీగా రొమాంటిక్ మరియు కమర్షియల్ అంశాలు కలగలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే పాత్రకు కూడా మంచి గుర్తింపు ఉంటుందని సమాచారం. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ రోల్ విషయమై ప్రచారం అవుతున్న వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: