కన్నడ నాట ఇటీవల భారీ ఖర్చుతో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1, కన్నడంతో పాటు మన దేశంలోని పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకోవడం జరిగింది. యువ నటుడు యాష్, నూతన నటి శ్రీనిధి శెట్టి జతగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇక ఆ సినిమా భారీ విజయం తరువాత, ప్రస్తుతం దానికి సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 ని అంతకు మించి అత్యధిక ఖర్చుతో మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తోంది సినిమా యూనిట్. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు పలువురు బాలీవుడ్ నటులను కూడా ఎంపిక చేసి చిత్రికరిస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమా తరువాత ప్రశాంత్ దర్శకత్వం వహించబోయే సినిమాపై గత కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నిజానికి కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోని ఒక నిర్మాతైన నవీన్ ఎర్నేని, ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తమకు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా ఒప్పందం కుదిరిందని, అయితే ఆయన ఏ హీరోకి కథ చెపితే వారితో తమ సినిమా ఉంటుందని, అయితే ఒకింత ఎన్టీఆర్ తో అది కుదిరే అవకాశం కూడా ఉన్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు. ఇక మధ్యలో ప్రశాంత్ నీల్, మహేష్ బాబును రహస్యంగా కలిసినట్లు వార్తలు రాగా, 

ఇక మరొక రెండు రోజుల్లో మరొక్కసారి ప్రశాంత్, సూపర్ స్టార్ మహేష్ ను కలవబోతుండడం టాలీవుడ్ వర్గాల్లో ఎంతో చర్చనీయాంశం గా మారింది. నిజానికి గతంలో తన వద్ద ఉన్న ఒక స్టోరీ లైన్ ని మహేష్ కి వినిపించిన ప్రశాంత్, అది ఆయనకు నచ్చడంతో, ప్రస్తుతం చాలా వరకు దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని మరొక రెండు రోజుల్లో మహేష్ ను కలుస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాక అతి త్వరలో ఆ సినిమా విషయమై ప్రశాంత్ ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందట. మరి మహేష్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా విషయంలో ప్రచారం అవుతున్న ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: