సౌందర్య, అంజలా జావేరి, కాజల్ అగర్వాల్, సమంత..ఇలాంటి అందమైన అమ్మాయిలను హీరోయిన్స్ గా చూడటానికి మనకు తెలీకుండా కొన్నేళ్ళే పట్టి ఉంటుంది. ఎందుకంటే వెండితెర మీద మెరిసే వరకు ఇంత అందగత్తె ఇన్నాళ్ళు ఎక్కడుందబ్బా అని ప్రేక్షకులే కాదు, సినిమా వాళ్ళు అనుకోవడం చాలా కామన్. ఇప్పుడు ఇదే విషయాన్ని మన టాలీవుడ్ హీరోయిన్ కూడా చెప్తోంది.'ఆర్ ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ రీసెంట్‌గా 'ఆర్డీఎక్స్ లవ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సి కళ్యాణ్ నిర్మించిన ఆర్డీఎక్స్ లవ్ ఈ సినిమాకి శంకర్ భాను దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ సడన్‌గా కాస్త ఎమోషనల్ అయ్యింది. తను ఈ స్థాయికి రావడానికి ఎంతగా కష్టపడిందో పాయల్ మాటలతో అర్థమవుతోంది.

పాయల్ సినిమా అవకాశాల కోసం ముందు ముంబయిలో దాదాపు ఆరు సంవత్సరాలు తిరిగిందట. ఆ ఆరు సంవత్సరాల్లో ఎంతో మంది సౌత్ ఫిల్మ్ మేకర్స్ తనకి ఆడిషన్స్ తీసుకున్నారట. కాని ఏ ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదని వెల్లడించింది. అదంతా తలచుకొని తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లి పోయిందట పాయల్. ఎంతమంది తనని హీరోయిన్ గా పనికి రావని రిజక్ట్ చేసినా కూడా తన ప్రయత్నాలు వదిలి పెట్టకుండా ముంబయిలోనే సినిమా ఆఫీసులకి తిరుగుతు గట్టిగా ప్రయత్నించిందట. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందానంటు తన ఆనందాన్ని వ్యక్తపరచింది.

ఆర్టీఎక్స్ లవ్ సినిమా మంచి ఎంటర్ టైనర్ తో పాటు అందరిని ఎడ్యుకేట్ చేసే సినిమా...ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ను అందించడంతో పాటు కాస్త ఆలోచింపజేస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. స్టోరీ లైన్ వినగానే నాకు నచ్చి వెంటనే నటించేందుకు సైన్ చేశాను. 45 రోజుల పాటు పాపి కొండలు.. పోలవరం ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. అక్కడ మొబైల్ సిగ్నల్ లేదు.. సరైన ఫుడ్ లేదు.. సరైన వసతి లేదు అయినా కష్టపడి సినిమాను పూర్తి చేశాం అని చిత్ర విశేషాలను తెలిపింది. అంతేకాదు తనని ఇలా చూడటానికి మీకు ఆరేళ్ళు పట్టిందని చెప్పుకుంది. మరి ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటో తెలీదు గాని ప్రస్తుతం మాస్ మహా రాజా రవితేజ,విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు గనక సూపర్ హిట్టయితే ఇక టాలీవుడ్ లో పాయల్ సెటిల్ అయినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: