‘ఫగ్లీ’ తో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది కియరా అద్వానీ. తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన మెరిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’తో మరోసారి తెలుగువారిని పలకరించింది కియారా.. అయితే ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేదు. హిందీలో మాత్రం హిట్ సినిమాలు చేస్తూ అదరగొడుతోంది.
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' లో హీరోయిన్గా చేసి అందరి హృయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం కియారా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అందులో భాగంగా ప్రస్తుతం అక్షయ్ కుమార్తోనే రెండు చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది.
నటిస్తున్న 'గుడ్ న్యూస్', 'లక్ష్మీ బాంబ్' సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నది. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్' హారర్ కామేడీ 'కాంచన'కు రీమేక్గా వస్తోంది. 'లక్ష్మీబాంబ్' 2020 జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.