బర్త్ డే సెలెబ్రేషన్స్ లో విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య, బెల్లంకొండ శ్రీనివాస్, రాశి ఖన్నా ఇలా సినీ సెల‌బ్రెటీలు ఎంతో మంది అక్క‌డ త‌ళుక్కుమ‌న్నారు. మరికొందరు సెలెబ్రిటీలు కూడా బాబీ కుమార్తె పుట్టినరోజు వేడుకలో సందడి చేశారు.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరక్కుతున్న వెంకీ మామ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


నిర్మాతలుగా మారిన దర్శకుల జాబితాలో రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ , మారుతి, రాఘవ లారెన్స్ లాంటి సక్సెస్ ఫుల్ గా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ దర్శకుడు ఈ జాబితాలో వచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు.


 'పవర్' మూవీతో దర్శకుడిగా పరిచయమై ప్రస్తుతం తన కెరీర్ లో నాలుగో సినిమా చేస్తున్న కే.ఎస్.రవీంద్ర (బాబీ) త్వరలో నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం వెంకటేష్-నాగ చైతన్య లతో ‘వెంకీ మామ’ సినిమా తెరకెక్కిస్తున్న బాబీ ఈ సినిమా తర్వాత తన ప్రొడక్షన్ స్థాపించి అరుణ్ పవర్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని అరుణ్ పవర్ మీడియాకు తెలిపారు.
కే.ఎస్.రవీంద్ర తాజా నిర్ణయంపై అభిమానుల్లో ఉత్కంత నెలకొంది. మరి నిర్మాత రోల్ లో బాబీ ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలుసుకొవాలంటే  కొంత కాలం పాటు వేచిచూడాల్సిందే మరి.


వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తోన్న చిత్రం. శరవేగంగా షూటింగ్ సాగుతున్నా -ఇటీవలి కాలంలో సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ అందలేదు. అయితే దర్శకుడు బాబి పుట్టినరోజు సందర్భంగా -సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. వెంకీ, చైతూ ఫ్యాన్స్ కోసం అన్నట్టు -ఓ మేకింగ్ వీడియోను బయటకు వదిలింది. మామా అల్లుళ్లను ఒకే ఫ్రేమ్‌లో చూపించి -్ఫ్యన్స్‌లో జోష్ పెంచింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో వస్తున్న చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. గత సంక్రాంతికి ఎఫ్2తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్, అదే సెంటిమెంట్‌ను ఈసారీ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారికంగా ప్రకటించకున్నా -సినిమా సంక్రాంతికి థియేటర్లకు వచ్చే అవకాశాలే లేకపోలేదన్నది ఓ అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి: