గత ఏడాది ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌ ఆ సినిమా ఫ్లాప్‌తో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.సంవత్సరంకు పైగా వెయిట్‌ చేసి చివరకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమాకు ‘అల వైకుంఠపురంలో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఆ సినిమాతో పాటు ఇప్పటికే ‘ఐకాన్‌’ మరియు సుకుమార్‌ దర్శకత్వంలో మూవీని అల్లు అర్జున్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు.


అలవైకుంఠపురంలో చిత్రం తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒక వైపు సుకుమార్‌ స్క్రిప్ట్‌తో రెడీగా ఉంటే మరో వైపు ఐకాన్‌ మూవీ చేసేందుకు వేణు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.వీరిద్దరి సినిమాలు కొద్ది తేడాతోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఆ రెండు సినిమాలు సెట్స్‌ పై ఉండగానే సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఈయన మరో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అల్లు అరవింద్‌ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేయిస్తున్నాడట.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలా వరకూ చిత్రీకరించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సీన్స్ ఒక 10 నిమిషాలపాటు ఉంటాయట. ఈ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
ఈ ఎమోషనల్ సీన్స్ ను త్రివిక్రమ్ హార్ట్ ఫుల్ గా చిత్రీకరించాడని అంటున్నారు. ప్రతి ఒక్కరి మనసులకు ఆ సీన్స్ కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, 'టబు' కీలకమైన పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. మ‌రి ఈ చిత్రం క్లైమాక్స్ కూడా అత్తారింటికి దారేది టైప్‌లో ప్రేక్ష‌కుల గుండెల్ని పిండేయ‌నున్నాడు త్రివిక్ర‌మ్ అంద‌రూ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: