తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 3 నడుస్తుంది.  గత బిగ్ బాస్ సీజన్ 1, 2 లో ఎన్నో కాంట్రవర్సీలు..గొడవలు, గ్రూపులతో విమర్శలు వచ్చాయి.  కానీ, ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 లో ఎంతో ప్రశాంతంగా హ్యాపీ హ్యాపీగా సాగిపోతుంది. ఎవరి మద్య ఈగో ఫీలింగ్స్, గొడవలు, గ్రూపులు లేకుండా టాస్క్, గేమ్స్ పరంగా కఠినంగా ఉన్నా తర్వాత అంతా కలిసి పోతున్నారు.  అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారి వర్షన్ మాత్రం వేరుగా ఉంటుంది. ఇంట్లో కొంతమంది గ్రూపులుగా ఉన్నారని..కొంత మందికి ఈర్ష్యా ద్వేశాలు ఉన్నాయని అంటున్నారు.

తాజాగా గత ఆదివారం పునర్నవి భూపాలం ఇంటి నుంచి బయటకు వచ్చింది.  ఆమె బయటకు రావడానికి ఇష్టపడ్డవారు ఎంత సంబరాలు చేసుకున్నారో లేదో తెలియదు కానీ.. బిగ్ బాస్ 3 కంటిస్టెంట్ హిమజ మాత్రం తీన్ మార్ డ్యాన్స్ వేస్తూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచింది.  అప్పట్లో హిమజ పలు ఇంటర్వ్యూలో తనను ఇంటి సభ్యులు చాలా అవమానించారని..ప్రతి విషయంలో తనను టార్గెట్ చేశారని..ముఖ్యంగా పునర్నవి అయితే రూడ్ గా వ్యవహరించేదని ఆరోపించింది.

పున్నూ తో ఎంత సన్నిహితంగా ఉండాలని చూసినా కొంత కాలం తనతో మాటలు కూడా కట్ చేసిందని ఆవేదన చెందింది.  ఈ నేపథ్యంలో పున్నూ ఎలిమినేట్ కావడంతో హిమజా పట్టరాని ఆనందం పొందింది.  తాజాగా ఈ విషయంపై స్పందించిన పునర్నవి.. 'అది ఊహించిన విషయమే' అని కొట్టిపారేసింది. హిమజ ఎందుకు అలా చేసిందో తననే అడుగుతానని.. దానితో వాదనలో ఎవరూ గెలవలేరని చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: