సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు" ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మహర్షి హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసరుగా కనిపించనున్నారు. ఆర్మీకి సంబంధించిన కీలక్ సన్నివేశాల్ని కాశ్మీర్ లో షూట్ చేసిన విషయం తెలిసిందే.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో మహేష్ తన కుటుంబంతో కలిసి ట్రిప్ కి వెళ్ళాడు. ట్రిప్ ముగుంచుకుని ఇంటికి చేరుకున్న మహేష్ తదుపరి షెడ్యూలుకు సిద్ధమవుతున్నాడట.గత షెడ్యూల్ నందు కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కీలక పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాలో ఈ బురుజు దగ్గర జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ గా నిలుస్తాయట.


దసరా కానుకగా సరిలేరు టీం ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు ముందు నిలబడి ఉన్నాడు. అయితే ఆర్మీ ఆఫీసరుగా కనబడాల్సిన మహేష్ ఇలా గొడ్డలి ఎందుకు పట్టుకున్నాడని అందరు అనుకున్నారు. అయితే కథలో ట్విస్ట్ అదేనట. బోర్డర్ లో గన్ పట్టుకుని పరుగెత్తాల్సిన మహేష్ గొడ్డలి పట్టడం వెనక పెద్ద కథే ఉందని అర్థం అవుతుంది. కథలో కూడా ఇదే కీలకమైన పాయింట్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడట.


విడుదలైన తాజా పోస్టర్ లోని లుక్ తో సరిలేరు నీకెవ్వరూ మూవీలో ఫ్యాక్షన్ ఛాయలు ఉంటాయని అర్థం అవుతుంది.అయితే అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీ కంపల్సరీ అని అందరికీ తెలుసు. ఫ్యాక్షనిస్ట్, మేజర్ పాత్రలు చేస్తున్న మహేష్ తో అనిల్ రావిపూడి కామెడీ ఎలా చేయించాడనేది ఆసక్తికరం. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా రష్మిక నటిస్తుంది




మరింత సమాచారం తెలుసుకోండి: