టాలీవుడ్ సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్, దిల్ రాజు,
అనిల్ సుంకరలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. లేడీ అమితాబ్ గా పేరుగాంచిన సీనియర్ నటి
విజయశాంతి గారు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక
మహేష్ బాబు సరసన
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో
మురళి శర్మ, సంగీత, బండ్ల గణేష్, శ్రీనివాస రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, హరితేజ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను గ్రేట్ ఇండియన్ ఫిలింస్ సంస్థవారు అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రైట్స్ ఎంత ధరకు అమ్ముడయ్యాయి అనేది మాత్రం తెలియరాలేదు. గతంలో
మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు, పోకిరి,
భరత్ అనే నేను,
మహర్షి సినిమాలను ఇదే సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. అయితే వారు కొనుగోలు చేసిన సినిమాలన్నీ మంచి లాభాలను దక్కించుకోగా, ఒక్క
మహర్షి మాత్రం ఒకింత తక్కువ స్థాయిలో రాబట్టింది. ఇకపోతే ప్రస్తుతం తాము కొనుగోలు చేసిన ఈ సరిలేరు సినిమా,
తప్పకుండా మంచి సక్సెస్ సాధించి అందరికి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఆ సంస్థవారు నేడు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన
అనిల్ సుంకర కూడా, గ్రేట్ ఇండియన్ ఫిలింస్ వారి ద్వారా మా సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అవుతూ ఉండడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. మరొక మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!