ఈ మద్య చాలా మంది యంగ్ స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా తీయడం మహా గగనం అయ్యింది. కొంత మంది హీరోలు అయితే ఏకంగా రెండు మూడు సంవత్సరాలు కూడా గ్యాప్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటికి ఆరు పదులు దాటినా తనలోని పదును ఇంకా తగ్గలేదు అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.  కాలా సినిమా తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తారని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నారు తప్పా పూర్తి స్థాయిలో వెళ్లడం లేదు. 

పెట్టా సినిమా తర్వాత తమిళంలో స్టార్ దర్శకులు మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారట..దానికి సంబంధించిన ఫోటోలు ఇటీవల లీక్ అయ్యాయి. 'దర్బార్' సినిమా విడుదలకి సిద్ధమవుతూ ఉండగానే, రజనీ తదుపరి సినిమా పట్టాలెక్కడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. 'ఎంథిరన్' .. 'పేట' తరువాత సన్ పిక్చర్స్ బ్యానర్లో రజనీ చేస్తున్న మరో సినిమా ఇది. 

అంతే కాదు ఈ సినిమా శివ దర్శకత్వం వహించనున్నాడనే విషయాన్ని కూడా వాళ్లు స్పష్టం చేశారు.  కాగా, సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఈ మూవీ 168 కావడం విశేషం. ఇప్పటి వరకు తమిళ మరో స్టార్ హీరో అజిత్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు దర్శకులు శివ. ఈ సినిమాకి దర్శకుడు కావడంతో అభిమానుల్లో మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.  ఆరు పదుల వయసులో కూడా యంగ్ హీరోలు నటించని విధంగా ప్రతి సంవత్సరం రెండు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్న రజినీకాంత్ కి స్టామినాకు ఫిదా అవుతున్నారు అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: