కొన్నాళ్ల క్రితం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ రెండు సినిమాల రిలీజ్ తరువాత యంగ్ రెబల్ స్టార్
ప్రభాస్ దేశవాప్తంగా విపరీతమైన క్రేజ్ తో పాటు భారీగా మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. అయితే ఆ సినిమాల సక్సెస్ ఇచ్చిన ఊపుతో ఆయన ఇటీవల యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటించడం జరిగింది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్
ప్రభాస్ సరసన హీరోయిన్ గా జోడి కట్టడం జరిగింది.
అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. సినిమాలో విజువల్స్, గ్రాఫిక్స్ మరియు భారీ స్థాయి స్టార్ క్యాస్టింగ్ కి ఇచ్చిన ప్రాధాన్యత సినిమాలో కథ, కథనాలకు దర్శకుడు ఇవ్వలేదనే విమర్శలు ఆ సినిమాపై భారీగా వచ్చాయి. ఇకపోతే ఇటీవల మెగాస్టార్
చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా
సైరా నరసింహారెడ్డి కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక కేవలం యావరేజ్ రేంజ్ దగ్గరే ఆగిపోయింది.
ఇక ఆ సినిమా తరువాత దర్శకుడు
సురేందర్ రెడ్డి చేయబోయే తదుపరి సినిమాలో హీరోగా
ప్రభాస్ నటించబోతున్నట్లు ఒక వార్త కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తుండగా, అది చాలా వరకు నిజమేనేనంటూ నేడు ఫిలిం నగర్ వర్గాలు కూడా అంటున్నాయి. నిజానికి
ప్రభాస్ కోసం
సురేందర్ రెడ్డి ఎప్పుడో ఒక మంచి కథను సిద్ధం చేసి ఉంచారని, కాకపోతే
సైరా ప్రమోషన్స్ వల్ల వరుసగా బిజీగా ఉండడం వలన ఆయన
ప్రభాస్ ని కలవడం కుదరలేదని, రాబోయే మరొక వారం రోజుల్లో
ప్రభాస్ కు
సురేందర్ రెడ్డి కథను వినిపించనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగాల్సిందే..... !!