అల్లు అర్జున్,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్,  గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. జులాయి,  సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

 

 

సినిమా లో టబు,  సుశాంత్,  నవదీప్,  నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్థాయని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఉండేది తక్కువే కాని అందులో బన్నీ చూపించే ఎమోషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయట. మాములుగానే ప్రతి సీన్ లో తన పెన్ పవర్ చూపించే త్రివిక్రమ్ ఆ సీన్స్ లో సువర్ డైలాగ్స్ రాశాడట. 

 

సినిమా అంతా అనుకున్న దానికన్నా బాగా వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం పూజా హెగ్దే కూడా మంచి ఫామ్ లో ఉంది కాబట్టి ఆమె కూడా సినిమా కు ప్లస్ అవుతుందని అంటున్నారు. 2020 సంక్రాంతి బరిలో ఈ సినిమా వస్తుంది. సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

 

సంక్రాంతికి  మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా రిలీజ్ అవుతుంది ఈ రెండు సినిమా ల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. మహేష్,  బన్నీ ఇద్దరు తమ సినిమా మీద నమ్మకంగా ఉన్నారు. పండుగ టైం కాబట్టి రెండు సినిమాలు విజయం సాధించే అవకాశం ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: