తెలుగు లో ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న తమిళ హీరో విశాల్ వాస్తవానికి అచ్చమైన తెలుగు వాడే..కాకపోతే తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు.  పందెంకోడి మంచి సక్సెస్ అందుకున్న తర్వాత విశాల్ నటించిన ప్రతి సినిమా తెలుగు లో రిలీజ్ చేస్తూ వచ్చాడు.  టాలీవుడ్ లో విశాల్ కి మంచి ఆదరణ లభిస్తుంది.  హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో విశాల్ పై కాంట్రవర్సీలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇటీవల విశాల్ నిశ్చితార్థం అనీశా రెడ్డి తో జరిగింది. 

మార్చి 18న వీరిద్దరి నిశ్చితార్థమూ జరుగగా, ఈ నెల 9న వివాహమని అంతా అనుకున్నారు. కానీ, 9న వివాహం జరగకపోవడం, దీనికి సంబంధించిన వార్తలేవీ బయటకు రాకపోవడంతో ఇద్దరి నిశ్చితార్థం రద్దయిందన్న పుకార్లు వచ్చాయి.  దాంతో మరోసారి విశాల్ నిశ్చితార్థంపై రక రకాల కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.విశాల్-అనీశాల మధ్య నెలకొన్న మనస్పర్థలే పెళ్లి రద్దుకు కారణమన్న ప్రచారం జరిగింది. దానికి తోడు విశాల్ ఫోటోలను అనీశా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

తాజాగా తన కుమారుడు, హీరో విశాల్ వివాహం ముందుగా నిర్ణయించినట్టు అనీశా రెడ్డితోనే జరుగుతుందని ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి స్పష్టం చేశారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వారిద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలన్న విషయమై ఇంతవరకూ తేదీని నిశ్చయించలేదని స్పష్టం చేశారు. నడిగర్ సంఘం నూతన భవంతిలో వారి పెళ్లి వైభవంగా జరుగుతుందని అన్నారు. మొత్తానికి విశాల్ తండ్రి జీకే రెడ్డి తాజా వ్యాఖ్యలతో  పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: