దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం స్టార్ట్ చేసినప్పటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కథేంటన్నది రాజమౌళి ముందే చెప్పేశాడు. అంత పెద్ద సినిమాలో తానేం చెప్పదలచుకున్నాడో ముందే చెప్పడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఇక్కడ రాజమౌళి థియరీ వేరే రకంగా ఉంది. 


బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి తర్వాతి సినిమాపై ఎన్నో అంచనాలుంటాయని ముందే గ్రహించి, తన తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందో ముందే ఓ క్లారిటీ ఇస్తే ప్రేక్షకుల్లో ఓ మైండ్ సెట్ క్రియేట్ చేయచ్చని ఫీల్ అయ్యాడట. అందుకే సినిమా షూటింగ్ ప్రారంభం కూడా అవకముందే కథ ఏంటనేది ముందే చెప్పాడు. అయితే ఈ సినిమాకి మొదటిసారిగా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రాని తీసుకున్నారట.


అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే మాటల రచయితగా పనిచేస్తున్న సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కథ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సాయిమాధవ్ మాట్లాడుతూ- ''ఆర్.ఆర్.ఆర్ నిజంగానే ఓ అద్భుత కథాంశంతో తెరకెక్కుతోంది. రాజమౌళి గారు కథ చెప్పినప్పుడు .. ఒక కథను ఇలా కూడా రాయొచ్చా అనిపించింది.


ఆయన క్లారిటీ అద్భుతం. ఆల్రెడీ సినిమా మొత్తాన్ని ఆయన మెదడులో ఊహించేసుకున్నారు.ఇప్పుడు దానిని మనకి చూపించడానికి ఏం చెయ్యాలో అది చేస్తున్నారు అంతే!'' అంటూ ఎమోషనల్ గా స్పందించారు. ఇంకా బాహుబలి సినిమాకు తాను పనిచేయాల్సి ఉందని, కానీ కుదరలేదని ఏదైతేనేమి ఇప్పుడు కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

rrr