అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. జనసేన అధినేతగా ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ తన ముఖానికి రంగు వేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే తనకు ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. 

 

అయితే తనకు పెర్ఫెక్టుగా సూట్ అయ్యే కథల కోసమే వెయిట్ చేస్తున్నాడు పవన్. ఈ  క్రమంలో డైరెక్టర్ క్రిష్ ఓ అద్భుతమైన కథని పవన్ కోసం సిద్ధం చేశాడని తెలుస్తుంది. పవర్ స్టార్ రేంజ్ కు తగినట్టుగా ఈ కథ ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ పవన్ కూడా కథ విని ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ టాక్. 

 

ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకులను నిరాశపరచిన క్రిష్ పవన్ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 

 

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో క్రిష్ ఒకరు. ఎన్టీఆర్ సినిమా తో ఫెయిల్ అయినా పవన్ సినిమా కోసం తగిన జాగ్రత్త వహిస్తున్నాడట క్రిష్. పవన్ రీ ఎంట్రీ కోసం ఫాన్స్ చాలా ఎక్సయిట్ గా ఉన్నారు. మరి పవర్ స్టార్ తో క్రిష్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: