జబర్ధస్ ఈ వినోద కార్యక్రమం తెలుగులో ఎంత పాపులర్ అని చెప్పాలిసిన అవసరం లేదు. ఈ కార్యక్రమం మొదట్లో ఒక్క అనుసయనే యాంకర్ గా వ్యవహరించింది. కానీ కొన్ని కారణాల వాళ్ళ ఈ షో కి వచ్చింది యాంకర్ రష్మీ గౌతమ్. రష్మీ
గౌతమ్ తాను వచ్చి రాని తెలుగుతో తన అండ చందాలతో ఈ కార్యక్రమానికి ఒక లీడ్ తీసుకొచ్చింది. ఈ
బ్యూటీ కొన్ని సినిమాలలో తన అంద చందాలతో యువతని మంత్ర ముగ్దుల్ని చేసింది.
కానీ ఈ
భామ ఒక ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు అంతా చూసేది కేవలం డబ్బుల కోసమే అని ఘాటుగా మాట్లాడింది. చాలా కొందరు వరకు మాత్రమే ఇక్కడ క్రియేటివ్ శాటిస్ఫాక్షన్ కోసం పని చేస్తుంటారు అని అంటుంది. కానీ వందలో తొంభై మంది మాత్రం కచ్చితంగా డబ్బే ప్రధానం అంటారు. ఇక్కడ అయితే డబ్బుల కోసం లేదంటే మనసుకు నచ్చే పాత్రలు చేయాలి అని అంటోంది. తనకు ఎలాగూ మనసుకు నచ్చి తనను తాను నిరూపించుకునే ఛాలెంజింగ్ పాత్రలు ఎవ్వరూ ఇవ్వడం లేదని చెబుతుంది యాంకర్ రష్మీ. అందుకే డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని సంచలన సమాధానం చెబుతుంది ఈ
భామ ఇప్పుడు.
ఇప్పటి వరకు తనకు ఒక్క దర్శకుడు కూడా ఛాలెంజింగ్ రోల్ చెప్పలేదని కనీసం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కూడా రాలేదని చెబుతుంది ఈ బ్యూటీ. కేవలం తనను గ్లామర్ డాల్గానే దర్శకులు చూస్తున్నారని తను కూడా డబ్బు వస్తుంది కాబట్టి అలాంటి పాత్రలే చేస్తున్నాననంటుంది యాంకర్ రష్మీ. తాను కూడా మంచి పాత్రలు చేయాలని ఉంటుందని, అలా రాకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఎలాగూ క్రియేటివ్ శాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ అయినా పెంచుకోవాలి కదా అంటుంది రష్మీ.
అయినా డబ్బులు వచ్చినపుడు ఎక్స్ పోజింగ్ చేయడం తప్పేమీ కాదంటుంది రష్మీ గౌతమ్. అప్పుడప్పుడూ డబ్బుల కోసమే కాకుండా క్రియేటివ్ సైడ్ కూడా పని చేయాలని అనిపిస్తుందని, అందుకే వెబ్ సిరీస్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు తన మనసులోని మాట చెప్పింది ఈ జబర్దస్త్ యాంకర్. త్వరలోనే ఇది చేస్తానని కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఈ ఇండస్ట్రీలో తాను ఉన్నది మాత్రం డబ్బుల కోసమే అని కుండ బద్ధలు కొట్టేసింది యాంకర్ రష్మీ గౌతమ్. అయినా ఇలా నిజాయితీగా ఉన్నదున్నట్లు చెప్పేవాళ్లు కూడా ఎంతమంది ఉంటారు కదా... ?