టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మితం అవుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో మహేష్ బాబు మంచి ఫామ్ లో ఉండగా, 

మరోవైపు తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా చూడని అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇకపోతే సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండగా sri PRASAD' target='_blank' title='దేవిశ్రీ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను జనవరి 12న ప్రప్రంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సినిమా కూడా సంక్రాంతి బరిలో ఎప్పుడో నిలవగా, కొన్ని గంటల ముందే ఆ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. అనంతరం కాసేపటి తరువాత సరిగ్గా అదే రోజున మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' కూడా బాక్సాఫీస్ బరిలో నిలవనుందని ప్రకటన రావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల కళ్లన్నీ ప్రస్తుతం ఈ రెండు సినిమాల పైనే పడ్డాయి. మరి ఒకే రోజున బడా వార్ కు సిద్దమైన ఈ రెండు సినిమాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో, ఏ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: