తెలుగులో సైరా వసూళ్లు ఇప్పటికీ బాగున్నాయని సమాచారం. కొన్ని చోట్ల బాగానే ఆడుతుందట. కానీ నార్త్ లో మాత్రం ఈ సినిమా మొదటి రోజుకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ తో ఉత్తరాదిన నత్త నడకగా సాగిన సైరా ప్రయాణం దాదాపు ముగిసిందని బాలీవుడ్ మీడియా లేటెస్ట్ న్యూస్. చిరంజీవి నటించిన ఈ సినిమాకు ఇక ఏ రకంగాను వసూళ్లు వచ్చే అవకాశం లేదని బాలీవుడ్ ట్రేడ్ తేల్చి చెప్పేసింది. 10 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయిన తరుణంలో సైరా కథ దాదాపు ముగిసినట్టేనని అంటున్నారు. 

సాధారణంగా సినిమా బాగుంటే సౌత్ లో 3 వారాలు కూడా ఆడుతుంది. బాహుబలి-2, కేజీఎఫ్ లాంటి సినిమాలు నాన్ స్టాప్ గా నెల రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ బాలీవుడ్ లో పరిస్థితి వేరు. ఎంత పెద్ద సినిమా అయినా అక్కడ 10 రోజులే. ఒక వీకెండ్ దాటితే రెండో వీకెండ్ కు వసూళ్లు లాగడం కాస్త అనుమానమే. అలా మరో 4-5 వారాలు దాటితే సినిమా ఏకంగా డిజిటల్ వేదికలపై, టీవీ ఛానెళ్లపైకి వచ్చేస్తుంది. సైరాకు కూడా అదే దారి. 

ఈ శుక్రవారంతో 10 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఉత్తరాదిన సర్దేసింది. ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సైరాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు. కేజీఎఫ్ తో నార్త్ లో భారీగా లాభాలు చూసిన ఈ సంస్థ, సైరాతో మాత్రం భారీగా నష్టాలు మూటగట్టుకుంది. విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమాకు ఉత్తరాదిన కేవలం 7 కోట్ల నెట్ మాత్రమే వచ్చింది. మహా అయితే మరో కోటి రూపాయలు వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 8 కోట్ల రూపాయల లోపే సైరా కథ ముగియనుందట.

కేజీఎఫ్, సాహో సినిమాల మాదిరిగా ఉత్తరాదిన ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆ సినిమాలకు కనెక్ట్ అయినట్టు, సైరాతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. చిరంజీవి సినిమాకు అదే పెద్ద మైనస్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సైరా సినిమా ఉన్నంతలో సేఫ్ అని చెప్పాలి. మిగతా అన్ని చోట్లా ఈ సినిమా ఫ్లాప్ అని తేలింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: