2020 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్‌ 'సరిలేరు నీకెవ్వరు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో' మరో సూపర్ స్టార్ రజనీ కాంత్ 'దర్బార్‌ సినిమాలతో పాటు ఈ బరిలో పోటి పడేందుకు నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కూడా 'ఎంత మంచి వాడవురా' సినిమాతో రెడీ అవుతున్నాడు. అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంలో కాస్త డైలమాలో ఉన్న ఈ స్టార్స్ సినిమాలు రెండు ఎట్టకేలకు తమ సినిమా రిలీజ్ డేట్ ను కన్‌ఫర్మ్ చేస్తు తాజాగా పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.   

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్‌ అవుతోంది. అలాగే అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' కూడా అప్పుడే రిలీజ్ చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యారు. ఈ రెండు సినిమాలు జనవరి 12 న రిలీజ్ అంటు కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. 
 
'సరిలేరు నీకెవ్వరు'. సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా పూజా హెగ్డే ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కి  జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి లాంటి డీసెంట్ హిట్స్ ని ఇచ్చిన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ ఈసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ 'అల' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక మిగిలిన రజనీ 'దర్బార్', నందమూరి కళ్యాణ్ రామ్‌ ల 'ఎంత మంచి వాడవురా'.. రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాలతో పాటు బాలయ్య సినిమా, విశాల్ సినిమా కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: