తమిళ హీరో విశాల్ మీద ఈ మధ్య కొన్ని కాంట్రవర్సీలు క్రియోట్ అయిన సంగతి తెలిసిందే. అవి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారడమే కాదు వైరల్ గాను సోషల్ మీడియాలో రక రకాల కథనాలు అల్లేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఇలాంటివి అనుభవం లేనప్పటికి ఇప్పుడు వీటిని బాగానే వంటబట్టించుకున్నాడు ఈ మాస్ హీరో. ఇక ఈ సారి విశాల్ పెళ్ళి విషయం లో కొంత కాలంగా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. అందుకు పక్కా క్లారిటి దొరికిందని కోలీవుడ్ మీడియా సమాచారం. తన తనయుడు విశాల్ పెళ్లి ఆగిపోలేదని ప్రకటించాడు నిర్మాత జీకే రెడ్డి. హైదరాబాద్ కు చెందిన అనీశాతో విశాల్ కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 

'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా నటించిన అనీశాతో విశాల్ కు ఈ సంవత్సరం మార్చిలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి ముహూర్తాలేవీ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ఆగిపోయిందనే రూమర్ ఒకటి బాగా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను వైరల్ అయింది. ఆ రూమర్ విషయంలో విశాల్, అనీశాలు స్పందించలేదు. ఈ నేపథ్యంలో విశాల్ తండ్రి స్పందించారు. తన తనయుడి పెళ్లి ఆగిపోలేదని, అనీశాతోనే విశాల్ పెళ్లి జరుగుతుందని ఆయన ప్రకటించారు. అంతేకాదు నడిగర్ సంఘం కోసం విశాల్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనంలో తన పెళ్లి జరుగుతుందని జీకే రెడ్డి ప్రకటించారు.

అలాడే నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడి అయితే విశాల్ ప్యానలే మళ్లీ విజయం సాధిస్తుందని జీకే రెడ్డి ధీమాగాను ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ పూర్తి అయినా.. ఫలితాలు కోర్టు ఆదేశాల నేపథ్యంలో వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో జీకే రెడ్డి , విశాల్ ప్యానల్ విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. శరత్ కుమార్, రాధిక ప్యానల్ వాళ్లతో కూడా తమకు ఎలాంటి విబేధాలు లేవని.. వారు తమ కుటుంబ సభ్యుల్లాంటి వారే అని, తన నిర్మాణంలో వారు కూడా నటించారని జీకే రెడ్డి గుర్తు చేశారు. ఏదేమైనా త్వరలో విశాల్ పెళ్ళి కబురు రాబోతోందని తన తండ్రి క్లారిటి ఇచ్చారు. మొత్తానికి సోషల్ మీడియాలో కొంతమంది విశాల్ పెళ్ళి ఆగిపోయిందంటు వార్తలు పుట్టించడంతో అది గాలి వార్త అని విశాల్ తండ్రి కొట్టిపారేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: